13, జనవరి 2013, ఆదివారం

అనుమానాలు-మనో వాంఛలు.


షైతాన్‌ రెండు ప్రధాన మార్గాల ద్వారా మనిషిలోకి ప్రవేశిస్తాడు. ఆ రెండు మార్గా ల్లో ఒకటి: అనుమానాలు. రెండోది: మనో వాంఛలు. సాధారణంగా ఈ రెండు విష యాలే మనిషిని తన ప్రభువు పట్ల అవి ధేయతకు పాల్పడమని పురికొల్పుతూ ఉం టాయి. దైవ ప్రసన్నతను బడసేందుకు దోహదపడే పనుల నుండి ఆపుతాయి. అనుమానాలు మనోవాంఛలు మనిషిని స్వర్గం నుండి దూరం చేసి నరకాగ్నికి ఇంధనం అయ్యేలా చేస్తాయి. ఇక్కడ మేము మనుషుల్లో జనించే కొన్ని ముఖ్య మైన సంశయాలనుఅనుమానాలను గురించి పేర్కొంటున్నాం.
1. లైంగిక శక్తిపై అదుపు
ప్రజల్లో చాలామంది ఈ విధంగా ఆలో చిస్తారు. ''దేవుడు మానవుల్ని (స్త్రీ,పురుష) జంటగా సృష్టించాడు. వారిలో ఒండొకరి పట్ల లైంగిక ఆకర్షణ సృజించాడు. ఇది అమిత ప్రభావవంతమైనఅత్యంత ప్రమా దకరమైన శక్తి. దానిని ఎంతగా అణచు కోవాలని ప్రయత్నిస్తే అది అంతగా పైకి  ఉబికి వస్తుంది. దాన్ని మరీ ఎక్కువగా అదుపులో ఉంచటానికి ప్రయత్నిస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో అది కట్టలు తెంచుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే స్త్రీలు కప్పుకునే వస్త్రాలు వారి సౌందర్యా న్ని మరుగపరచి ఉంచుతాయి. అలాంట ప్పుడు యువకులు తమ కోర్కెల్ని అదుపు లో ఉంచుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా గనక లైంగిక కోర్కెల్ని అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నిస్తే అవి విజృంభిస్తాయి. ఆ విజృంభణే కొన్ని కొన్ని సార్లు కిడ్నాపింగ్‌ (అపహరణ)రేపింగ్‌ (బలాత్కారం) లాంటి రూపాల్లో అవతరిస్తుంది. కనుక సమస్యలన్నిటికి పరిష్కారం ఒక్కటే! అదేమిటంటే స్త్రీలను 'ముసుగు'ల్లో నుంచి బయటికి తీయాలి. అలా చేస్తే యువకులకు లైంగిక కోర్కెల్ని అదుపు చేసుకోవాల్సినఅవసరం ఉండదు. స్త్రీల ఒంపుసొంపుల్ని చూసుకొని వారు కాస్తయినా ఊరటను పొందుతారు. ఆ విధంగా స్త్రీలు అర్ధనగ్నంగా కళ్ళ ముందు కనబ డుతూ ఉంటే ఆ విధంగా వారి ఈ అవస రాన్ని తీర్చుకోగలరు. పైన చెప్ప బడిన తర్కం ప్రకారం లైంగిక కోర్కెల విజృంభణ జరగకుండా ఉంటుంది''.
పై సందేహ నివృత్తి -  పైన ఉటంకించబడిన మాటలు పైకి ఎంతో హేతుబద్ధమైనవిగాసమంజసమైన విగా కనిపిస్తాయి. అంధయుగవు సమా జాలను అల్లకల్లోలం నుండి కాపాడటానికి ప్రతిపాదించబడిన గొప్ప అభ్యుదయ సూత్రాల్లాగా కనిపిస్తాయి. వాస్తవానికి ఇలాంటి సూచనలుసలహాలు సమాజా నికి ఎంతో హానికరమైనవి. ఇవి మానవ వ్యవస్థను మరింత అల్లకల్లోలానికి గురి చేస్తాయి. ఒకవేళ పై అభిప్రాయమే నిజ మైనదయితే అమెరికాయూరప్‌ దేశాల్లో కిడ్నాప్‌లు,    మానభంగాలు,  స్త్రీల పట్ల  పురుషుల లైంగిక వేధింపులు మొదలగు అనైతిక నేరాల సంఖ్య తగ్గిపోవాల్సింది కదాకొన్ని దేశాల్లోనయితే వ్యభిచార గృహాలు తామరతంపరలుగా కనిపిస్తాయి. అక్కడ వ్యభిచారిణుల తమ అందచందా లను ప్రదర్శిస్తూజనాన్ని ఆకర్షిస్తూ ఉం టారు. మరి ఇలాంటి లైంగిక విచ్చలవిడి తనం వల్ల అక్కడ స్త్రీల కిడ్నాపింగ్‌లు తగ్గిపోయాయాపరుషుల లైంగిక దాహం తీరి పోయిందాస్త్రీలు ఆన్ని రకాల ప్రమా దాల నుండి సురక్షితంగా ఉంటున్నారా?
అమెరికాప్రభుత్వం అధికారిక వివ రాలు - దేశంలో పెట్రేగుతున్న నేరప్రవృత్తి వాస్తవిక స్థితిని తెలుసుకునే ఉద్దేశ్యంతో అమెరికన్‌ ప్రభుత్వం ఒక సర్వే జరిపించింది. ఆ సర్వే రిపోర్టులోని ముఖ్యాంశాలను 'అమె రికాలో నేర ఉదంతాలుఅన్న పేరుతో ఒక పుస్తకాన్ని కూడా వెలువరించటం జరిగింది. ఈ పుస్తకం అమెరికన్‌ ప్రభు త్వం తరపు నుండే ప్రచురించబడింది. అందులో ఆరవ పేజిలో 'అమెరికాలో ప్రతి ఆరు నిషిషాల్లో ఒక మానభంగం జరుగు తుంది. దాని కోసం ఆయుధాలను కూడా ఉపయోగించటం జరుగుతుందిఅని పేర్కొనబడింది. ఇది 1988వ సంవత్సరా నికి సంబంధించిన రికార్డు. ఆ పుస్తకం లోనే నేరాల సంఖ్యఅంకెలలో ఈ విధం గా పొందుపరచబడి ఉన్నాయి.
అమెరికాలో మానభంగాలు: 
సంవత్సరం   -   మానభంగాల సంఖ్య
 1978 లో         1,47,389
 1979 లో         1,68,134
 1981 లో         1,89,450
 1983 లో         2,11,691
 1987 లో         2,21,764
 పైన పేర్కొనబడిన లైంగిక నేరాల అంచనాల ద్వారా ఇంకా ఇలాంటి ఇతర విశ్వసనీయమైన వార్తల ద్వారా బోధపడే విషయమేమిటంటేఆయా దేశాల్లో లైంగిక నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయే గాని తగ్గటం లేదు. ఈ విషయాన్ని మనం క్రింద పేర్కొన బడిన దివ్యఖుర్‌ఆన్‌ సూక్తికి క్రియాత్మక వ్యాఖ్యానంగా భావించవచ్చు.
 ''ప్రవక్తా! నీ భార్యలకూనీ కూతుళ్లకూవిశ్వాసుల స్త్రీలకూ తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడ తీసుకోమని చెప్పువారు గుర్తింపబడటానికీవేధింబడ కుండా ఉండేందుకూ ఇది ఎంతో సము చిత మైన పద్ధతి''. (అల్‌ అహ్ జాబ్‌:59)  ఇమామ్‌ ఖుర్తుబీ తన వ్యాఖ్యాన గ్రంథం లో ఈ సూక్తి నేపథ్యం గురించి ఇలా వివ రించారు: మరుగుదొడ్లు నిర్మించబడక ముందు స్త్రీలు కాలకృత్యాలు తీర్చుకోవ టానికి సాధారణంగా దూరంగా ఉండే మైదాన ప్రాంతాలకు వెళ్ళేవారు. అలా వెళ్ళే స్త్రీలలో బానిసరాళ్ళుస్వేచ్ఛాపరులైన స్త్రీలు కూడా ఉండేవారు. అయితే స్వేచ్ఛాపరురాళ్ళైన స్త్రీలు మాత్రం బురఖాలు ధరించి సౌశీల్యవతులుగా గుర్తించబడే వారు. దారిలో ఆకతాయి కుర్రవాళ్ళు బానిసరాళ్ళను వేధించేవారు. పైన పేర్కొన బడిన సూక్తి అవతరించక ముందు ఒక సారి ఒక విశ్వాసురాలైన స్త్రీ కాలకృత్యాలు తీర్చుకోవటం కోసం బహిర్భూమికి వెళ్ళింది. ఆమెను బానిసరాలిగా భావించి కొందరు తుంటరులు వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. 
 ఆ స్త్రీ భయంతో కేకలు పెట్టింది. దాంతో వారు పలాయనం చిత్తగించారు. ఆమె వెళ్ళి దైవప్రవక్త (స) కు ఫిర్యాదు చేసింది. అప్పుడే ఈ సూక్తి అవతరించింది. చెప్పొచ్చేదేమిటంటేవీధుల గుండా వస్తూ పోతూ ఉండే మగవారి ముందు తమ సౌందర్యాన్ని ప్రదర్శించే స్త్రీలు వాస్తవానికి తోడేలు మనస్తత్వం గల పురుషుల ముందు తమల్ని తాము సమర్పించుకుం టున్నారనే నిజాన్ని గ్రహించాలి. ఎందు కంటే పరదా రాహిత్యం అనేది కోర్కెల్ని కవ్విస్తుంది. దీనికి భిన్నంగా పరదా ధరిం చే స్త్రీలు లైంగిక వాంఛల్ని జనింపజేసే తమ అలంకరణనుశరీరావయవాలను మరుగున ఉంచుకుంటారు. కేవలం మొహంఅరచేతులు తప్ప వారి శరీరం లో మరేమీ కానరావు.మరి కొంత మంది పండితులయితే కేవలం కళ్ళు మాత్రమే కనిపించాలంటారు. మొత్తానికి ఆ విధం గా నిండుగా పరదా ధరించి తమ అంద చందాలనుశరీరభాగాల్ని కప్పి పుచ్చు కునేముఖం    అరచేతులు తప్ప   వారి శరీరభాగం ఏదీ బయటకు కనిపిం చని విధంగామరి కొందరి దృష్టిలో కళ్ళు తప్ప మరేమీ కనిపించని విధంగా పరదా పాటించే ఆ స్త్రీలు ఎటువంటి లైంగిక కోర్కెల్ని ఏ విధంగా రెచ్చగొడ్తారుఅలాంటి స్త్రీ సమాజంలో ఏర్పడే అప సవ్యతలకు కారణభూతం అవుతుందాస్త్రీలు కష్టాలకుఇబ్బందులకు లోను కాకూడదన్న ఉద్దేశ్యం తోనే దేవుడు వారికి పరదా పద్ధతిని విధించాడు. ఫ్యాషన్లు ఇతర నగ్న దృశ్యాలు లైంగిక నేరాలను పెంచి పోషిస్తాయనీఅణిగి ఉండే లైంగిక కోర్కెల్ని కవ్విస్తాయనే విషయం దేవునికి బాగా తెలుసు. ఈ విషయాలన్నిటిని చదివి కూడా ఎవరయినా తమ అభి ప్రాయమే సహేతుకమైనదని పట్టుపట్టి మొండిగా వాదిస్తే వారి ఆలోచనా వికాసం కోసం మేము క్రింద నాలుగు వాస్తవాలను పేర్కొంటున్నాంగమనించగలరు.
మొదటి వాస్తవం: పైన పేర్కొనబడిన నేరాల సంఖ్య వారి వాదనను త్రోసిపుచ్చు తోంది.
రెండవ వాస్తవం: స్త్రీ పురుషులిద్దరిలో నూ లైంగిక వాంఛలు ఉన్నాయి. దేవుడు ఎన్నో కారణాల దృష్ట్యా వాటిని ఇరువురి లోనూ పొందుపరచాడు. వాటిలో సంతా నోత్పత్తి పరిరక్షణ కూడా ఒకటి. ఈ పరి స్థితి గనక లేకపోతే జాతి ఎలా మిగిలి వుంటుందిఅన్న విషయాన్ని మనం గమ నించాలి. సహజమైన ఈ కోర్కెల్ని ఎవరూ తిరస్క రించలేరు. మరలాంటప్పుడు పురు షులు నగ్నఅశ్లీలమైన దృశ్యాలు చూసి కూడా తమ సహజమైన కోర్కెల్ని అదుపు లో పెట్టుకోగలరని ఎలా ఆశించగలం?
మూడో వాస్తవం: స్త్రీల అలంకరణఅందచందాలు పురుషుల్లో అంతర్లీనమై ఉండే లైంగిక వాంధల్ని కవ్విస్తాయన్నది ఒక వాస్తవికమైన విషయం. స్త్రీ ముఖార విందం గానిఇతర అవయవాలు గాని  ఏవీ ఇందుకు తీసిపోవు. ఏ ప్రకృతి ధర్మం పై దైవం తనను సృష్టించాడోదాన్ని వ్యతిరేకించడంఇటువంటి భావోద్రేకాల ను రెచ్చగొట్టే దృశ్యాలను చూసిన  తర్వాత కూడా  తన   సహజ కోర్కెలను అణచుకో వడం అసాధ్యం.
నాల్గో వాస్తవం: లైంగిక వాంఛల్ని కవ్వింపజేసే అశ్లీల దృశ్యాలను సర్వ సామాన్యం చేయటం ద్వారానే తమ లైంగిక కోర్కెల్ని నియంత్రించుకోవడానికి అదే సరైన చికిత్స అని భావించుకున్నట్ల యితేదానివల్ల రెండు ఫలితాలు ఎదురవుతాయి.
మొదటిది: నగ్నఅశ్లీలమైన దృశ్యాలు చూసి కూడా ఎలాంటి భావోద్రేకాలకు లోనుకాని పురుషులు వాస్తవానికి నపుంస కులు. ఎందుకంటే వారి లైంగిక శక్తి అంతరించిపోయి ఉంటుంది. కనుకనే వారికి అలాంటి తలంపులు రావటం లేదు.
రెండోది: బహిరంగంగా నగ్నఅశ్లీల మైన దృశ్యాలు చూసినప్పటికీ లైంగిక వాంఛలు కలగటం లేదంటే బహుశా అలాంటి పరుషుల్లో లైంగిక పరమైన వ్యాధులు ఉండి ఉండవచ్చు. ఈ సందేహంలోని సత్యత గురించి వాది స్తున్నట్లయితే వారు మన సమాజంలోని పురుష గ్రూపులకు చెందిన పరుషులలో చేరిపోగోరుతున్నారా
అసంతృప్తి (నొ కన్విక్షన్ ) - ఇది రెండో అనుమానం. దీన్ని అనుమా నం అనడంకన్నా మనోవాంఛలకు దాసోహం అంటే బాగుంటుంది. పరదా పాటించని స్త్రీని ఉద్దేశ్యించి 'మీరు పరదా పాటించరెందుకండీ?' అని అడిగితేదానికి ఆమె నేనింకా సంతృప్తి చెంద లేదు. సంతృప్తి కలిగినప్పుడు ఇన్షా అల్లాహ్‌ా పరదా పాటిస్తాను అని సమా ధానమిస్తుంది ఈ విధంగా జవాబు చెప్పే సోదరీమణులు రెండు విషయాల మధ్య భేదం పాటించాలి. అవి:
 మొదటి విషయం ''దైవాజ్ఞ''  రెండో విషయం  ''మానవాజ్ఞ''  
ఓ నా చిట్ట చెల్లీ! పరదా పాటించమని చెప్పిందెవరు?  ఒకవేళ పరదా పాటించటం మానవాజ్ఞ అయి ఉంటే అందులో పాపంపుణ్యం రెంటికీ ఆస్కారముంది. ఇమామ్‌ మాలిక్‌ (ర) ఇలా   అంటున్నారు: మనిషి మాట సత్యమైనా కావచ్చు లేక అసత్యమైనా కావచ్చు. కనుక ఒక్క దైవప్రవక్త(స) తప్ప మిగతావారి మాటను మీరు అంగీకరించవచ్చు లేదా తిరస్కరించనూ వచ్చు. కాని ఏదైనా ఆజ్ఞ దైవాజ్ఞలకు సంబంధించినదయితేఅంటే దేవుడు తన పవిత్ర గ్రంథం లో ఏదయినా విషయం గురించి ఆజ్ఞాపించి ఉంటే లేక దాని గురించి మానవాళికి తెలియజేయమని తన ప్రవక్తను ఆదేశించి ఉన్నట్లయితే అలాంటప్పుడు అది తనకు సంతృప్తికరంగా లేదన్న సాకుతో ఏ మాన వుడూ దాన్ని తిరస్కరించలేడు. ఏ స్త్రీ లేక పరుషుడయినా ఫలానా ఆజ్ఞ దైవగ్రంథంలో పేర్కొనబడి ఉందని తెలిసి కూడా దాని పట్ల అభ్యం తరం తెలుపుతూదాన్ని అంగీకరించటానికి నిరాకరిస్తే వారు తమకు తాముగా ఇస్లాం ధర్మం నుండి బహిష్కరించబడటానికి అవకాశాలు కల్పించుకుంటున్నారని గ్రహించాలి. ఎందుకంటే వారి ప్రవర్తన మూలంగా వారికి దైవాజ్ఞలు సహేతుకమైనవన్న విషయంలో నమ్మకం లేదనీ ఆ విషయంలో వారు డోలాయమాన స్థితికి లోనై ఉన్నారని అర్థ మవుతోంది. ఈ ప్రవర్తన వారి విశ్వాసానికే గొడ్డలి పెట్టు! ఇది చాలా ప్రమాదకరమైన మాట.
   ఒకవేళ ఏ సొదరి అయినా తాను పాపాత్మురాలిననీమనోవాంఛల్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నాననీతనకు మనోబలం బొత్తిగా లేదనీతన హృదయం బలహీనమైనదని అంటే - ఇలాంటి మాటలు మాత్రం అసంతృప్త భావనల క్రిందికి రావు. ఎందుకంటే ఆమె తన బలహీన తల్నితప్పుల్ని ఒప్పుకుంటోంది. అదీగాక ఆమె తనకు ఇష్టమైతేనే దైవాజ్ఞల్ని నెరవేరుస్తాననీకష్టమైతే మానేస్తానని చెప్పట్లేదు కదా! అందుకని ఇలాంటి మాటలు అసంతృప్తి భావనల క్రిందికి రావు. అల్లాహ్  ఇలా సెలవిస్తున్నాడు:
 ''అల్లాహ్ ఆయన ప్రవక్తా ఏ విషయంలోనయినా ఒక తీర్పు చేసి నప్పుడు విశ్వాసి అయిన ఏ పురుషునికయినావిశ్వాసురాలైన ఏ స్త్రీ కయినాతరువాత తమ యొక్క ఆ విషయంలో స్వయంగా మళ్లీ ఒక నిర్ణయం తీసుకునే హక్కు లేదు. ఇంకా ఎవడైనా అల్లాహ్‌ాకుఆయన ప్రవక్తకు అవిధేయత చూపితేఅతను స్పష్టంగా మార్గభ్రష్టతకు గురి అయినట్లే''. (అల్‌ అహ్‌ాజాబ్‌ : 36) సరైన ఆలోచనాసరళి:
 మనస్ఫూర్తిగా దైవాన్ని విశ్వసించిఆయన్ని సర్వాధికారిగా అంగీ కరించినవారు మారు మాట్లాడకుండా ఆయన ఆజ్ఞల్ని శిరసా వహించాలి. ఒక నిజమైన విశ్వాసి ముఖ్య లక్షణమేమిటంటే అతను దైవదేశాలను విన్న వెంటనే వాటిని అమలు పరచటానికి ప్రయత్ని స్తాడు. విశ్వాసులు దైవాజ్ఞల్ని విన్నదే తడవుగా ఆచరించి చూపిస్తారని స్వయంగా దివ్యఖుర్‌ఆన్‌ కూడా ధృవీకరిస్తోంది. విశ్వాసులు ఇలా అంటారు: 'మేము ఆదేశం విన్నాంశిరసా వహించాం. స్వామీ! క్షమా భిక్ష పెట్టు. చివరికి మేమంతా నీ వద్దకే మరలి వస్తాం''. (అల్‌ బఖర: 285)
  దేవుని ప్రతి ఆజ్ఞ విషయంలోనూ మనం అది మన మంచి కోసమే ఉద్దేశ్యించబడినదిఅందులో మన కొరకు మేలు దాగి ఉందని భావిం చాలి. ఆయన స్త్రీల కొరకు పరదా పద్ధతిని నిర్ణయించాడు. కనుక పరదా పద్ధతిలో తమ కొరకు మేలు ఉందనీఅవి తమ మానమర్యా దలను కాపాడుతుందని స్త్రీలు గ్రహించాలి. దేవుడు అన్నీ తెలిసిన వాడు. అంతా ఎరిగినవాడు. ఆయన జ్ఞానం విశ్వాన్నంతటినీ పరి వేష్ఠించి ఉంది. ఆయనకు మనిషి పుట్టుకకు ముందు ఏం జరిగిందోభవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా తెలుసు. ముస్లింలమైన మనం ఈ విషయాన్ని మనసారా విశ్వసిస్తాం. అలాంటప్పుడు అనంత జ్ఞాన సంపన్నుడైన దేవుని మాటను పక్కన పెట్టి పరిమిత జ్ఞానం కల వాడైన మానవుని మాటను పట్టుకొని వ్రేలాడటం మార్ఖత్వం కాకపోతే మరేమిటి?
వాస్తవంపై ఆధారమయిన ఉదాహరణ:  పైన చెప్పబడిన విషయానికి సంబంధించి ఒక క్రియాత్మక ఉదాహ రణ ను గమనించండి. మనం ఒక కంప్యూటర్‌ కొన్నామనుకోండి. ఆ కంప్యూటర్‌ను తయారు చేసినవాడు మనకు దగ్గర్లోనే ఉన్నాడు. అతనికి కంప్యూటర్‌ ఉపయోగించే పరిజ్ఞానంతోపాటు దానికి సంబం ధించిన ఇతర వివరాలు కూడా తెలుసు. అలాంటప్పుడు మనం దారిన పోయే ఏ దానయ్యనోబండ్లుతోలే ఏ బుచ్చయ్యనో పిలుచుకు వచ్చి మాకు కంప్యూటర్‌ నేర్పించమని అంటే ఎలా ఉంటుంది.తలలో తెలి వున్న వాడెవడూ ఆ పని చేయడు. ఆ యంత్రాన్ని ఎలా ఉపయోగిం చాలో ఒకవేళ అది చెడిపోతే దాన్ని ఎలా బాగు చేసుకోవాలో తెలుసు కోవటం కోసం నిపుణుల్ని సంప్రతించమని బుద్ధి మనల్ని ఆదేశిస్తుంది.
  ఏ శక్తి సంపన్నుడయితే మనిషిని  పుట్టించిఅతన్ని అన్ని విధాలా తీర్చిదిద్దాడో ఆయనే మనిషికి ప్రభువు. కనుక ఒక వస్తువు వల్ల మనిషి కి లాభం చేకూరుతుందో లేక నష్టం కలుగుతుందో సహజంగానే ఆయనకు బాగా తెలిసి ఉంటుంది. అలాంటప్పుడు అల్లాహ్‌ాను వదలిమార్గదర్శకత్వం కోసం ఇతరుల్ని ఆశ్రయించటంసలహాలుఆదేశాల కోసం ఇతరుల్ని సంప్రతించటం అవివేకమే అవుతుంది. ముఖ్యంగా మూర్ఖుల సలహాలను పాటిస్తే మాత్రం వినాశాన్ని కొనితెచ్చుకోవలసి వస్తుంది. దైవేతరుల ముందు      తలవంచటాన్ని పిచ్చితనంగామూర్ఖత్వంగా తెలివితక్కువతనంగా అభివర్ణించవచ్చు. అవివేకుల హితబోధను ఆచరించే వ్యక్తి వినాశానికి గురౌతాడు. శోచనీయమైన విషయం ఏమిటంటే మనకు జవాబు ఇచ్చే శక్తిలేని వారిని మనం జవాబు కోరటం మనలో చాలా మందికి అసలు 'ఇస్లాంఅన్న పదానికి అర్థం ఏమిటో కూడా తెలీదు. వాస్తవానికి ఇస్లాం అంటే దైవాజ్ఞలకు శిరసావహించటంఆయనకు పూర్తిగా విధేయత చూపటంఆయన ఆదేశాల్నినిషేధాల్ని పాలించటం అని అర్థం.
సందిగ్ధంలో పడకు సోదరీ! మీరెప్పుడయినా పరదా పాటించని సోదరీమణులకు దాని ప్రాముఖ్యతను గురించి బోధిస్తే వారిలో కొంతమంది సోదరీమణులు నేనూ ముస్లింనే. విశ్వాసురాలినే. నేను కూడా ఫర్జ్‌నఫిల్‌ నమాజులు చేస్తుంటాను. రమజాన్‌ నెలలో ఉపవాసాలుంటాను. హజ్‌ లాంటి పవిత్ర విధిని కూడా నెరవేర్చాను. ఎన్నో సార్లు ఉమ్రా చేశాను. కొన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాను. కానీ పరదా విష యానికొచ్చేసరికి ఎందుకో అది నా మనసుకు నచ్చటం లేదు'' అని చెబుతుంటారు. అలాంటి మహిళకు మా సమాధానం ఇది:  చూడండి....! మీరు ఆ గొప్ప పనులన్నీ చేశారు. సంతోషకరమే! వాటన్నిటి మూలం దైవాజ్ఞలే కదా! ఆ విధుల్ని విడిచిపెడితే శిక్షకు గురవుతామన్న భయమున్నప్పుడు కొన్ని ఆజ్ఞల్ని విశ్వసించి మరి కొన్నిటిని వదలివేయటమేమిటిమరి చూడబోతే వాటన్నిటి మూలం ఒక్కటే కదా! ఉదాహరణకు దైవగ్రంథంలో నమాజ్‌ చేయటం విధి అని చెప్పబడింది కనుక మీరు నమాజ్‌ చేస్తున్నారనుకోండిమరలాంట ప్పుడు పరదాను పాటించటం కూడా విధే కదా! ఎందుకంటే ఖుర్‌ఆన్‌హదీసులలో పరదాను పాటించటం విధి అని నిరూపించబడింది. ఈ విషయంలో ఎలాంటి సందేహానికీ తావులేదు.
 దేవుడు ఇస్రాయీల్‌ జాతి వారిని మందలించిన విషయాన్ని మీరె ప్పుడూ వినలేదావారు కూడా దైవాజ్ఞల్లో కొన్నింటిని అంగీకరించి మరికొన్నిటిని వదలి పెట్టేవారు. వారి గురించి దేవుడు ఇలా అంటు న్నాడు: ''మీరు దైవగ్రథంలోని ఒక భాగాన్ని విశ్వసించిమరొక భాగాన్ని తిరస్కరిస్తారామీలో ఇలా చేసే వారిని ఇహలోక జీవితంలో ఘోర అవమానానికీపరలోకంలో తీవ్రమైన బాధకూ గురి చెయ్యటం తప్ప మరొక శిక్ష  ఏముంటుందిమీ చేష్టలు అల్లాహ్‌ాకు తెలియ కుండా లేవు.'' (అల్‌ బఖర:85) ఒక ప్రామాణికమైన హదీసు ప్రకారం దైవప్రవక్త(స) ఈ విధంగా ప్రవచించారు: ''ప్రళయదినాన నరకంలో అందరికంటే తక్కువ శిక్ష అనుభవించే వారి అరికాళ్ల క్రింద రెండు నిప్పు తునకలు ఉంచటం జరుగుతుంది. దాని వేడికి వారి మెదడు పొయ్యి మీదున్న కుండ ఉడికినట్లు కుతకుత ఉడికిపోతూ ఉంటుంది.'' (బుఖారీ 11/376)
ప్రియ సోదరీ! ఇహలోకపు డాబుదర్పాల కోసం నీవు పరలోక జీవితాన్ని నాశనం చేసుకుంటావానిన్ను నువ్వు భయంకర మైన శిక్షకు గురి చేసుకోదలచావామా వరకు మేము పరలోకంలో నీకు మంచి జర గాలనే కోరుకుంటున్నాం. దాని కోసం నువ్వు కాస్త తెలివిగా వ్యవహ రించాలనీబాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మనసారా వేడు కుంటున్నాం. 
3) విశ్వాసం మనసులో ఉంటుంది! మీరెప్పుడయినా పరదా పాటించని స్త్రీలను తమ వైఖరికి కారణ మేమిటని అడిగితే వారు ఒక్కసారిగా ''విశ్వాసం (దైవభీతి) మనసులో ఉంటే చాలు. ఎలాంటి పరదాలూ అవసరం లేదు'' అని అనేస్తారు. మరి మీరు ఈ విషయం గురించి ఎప్పుడయినా తోతుగా ఆలోచించారాపై సందేహానికి మూలం కొంతమంది చాలా అవాంఛనీయ అర్థంతో హదీసులకు భాష్యం చెబు తారు. ఉదాహరణకు క్రింద పేర్కొనబడిన దైవ ప్రవక్త(స) ప్రవచనాన్నే తీసుకోండి.''దేవుడు మీ ముఖాలనుమీ సిరిసంపదల్ని చూడడు. ఆయన మీ మనోగతాన్నిమీ ఆచరణల్ని మాత్రమే చూస్తాడు'' అని దైవప్రవక్త (స) ప్రవచించారు.(ముస్లిం)
 విశ్వాసం మనసులో ఉంటుందన్న మాట ముమ్మాటికీ వాస్తవమే. అయితే విశ్వాసం అనేది మనసులోనే పరిపూర్ణమవుతుందని దైవప్రవక్త ప్రవచన ఉద్దేశ్యం ఎంత మాత్రం కాదు. ఆచరణలు స్వీకృతిని పొంద టానికి చిత్తశుద్ధి దైవభీతి ఎంత అవసరమో తెలియజెప్పటమే ఈ హదీసు అసలు ఉద్దేశ్యం. వాస్తవం ఏమిటంటే చిత్తశుద్ధి లేకుండా దేవుడు ఏ పనినీ అంగీకరించడు. ఒకానొక సందర్భంగా దైవప్రవక్త(స) తన ఛాతీవైపు సైగ చేసి చూపిస్తూ ''దైవభీతి(తఖ్‌వా) ఇక్కడుంటుంది'' అని (మూడుసార్లు) అన్నారు. (ముస్లిం) నుజ్‌హతుల్‌ ముత్తఖీన్‌ సంకలనకర్త దానిని వివరణ ఇలా వివరిస్తున్నారు. ''అల్లాహ్‌ా ఏదయినా కర్మకు ప్రతిఫలం ఇచ్చేట ప్పుడు ఆంతర్యంమనస్సును బట్టియే నిర్ణయిస్తాడు. ఇదే విధంగా మనస్సును దైవాభీష్టానికి అనుగుణంగా మలచుకోవడంకోరికల కు సరయిన మార్గనిర్దేశనం చెయ్యడంఅల్లాహ్‌ాకు ఆగ్రహం కలి గించే దూషిత గుణాల నుండి పవిత్రం చేయడం కూడా అవసరం.
విశ్వాసానికి నిర్వచనం -  మనసులో ఉన్నంత మాత్రాన విశ్వాసం పరిపక్వత చెందదు. పరిపక్వత చెందని విశ్వాసం నరకం నుండి విముక్తి పొందటం కోసంస్వర్గంలో ప్రవేశించటం కోసం పనికి రాదు అహ్లె సున్నత్‌ వల్‌జమాత్‌కు చెందిన అత్యధిక మంది విద్వాంసులు విశ్వాసాన్ని ఈ క్రింది విధంగా నిర్వచిస్తున్నారు.   ''మనసుతో నమ్మటంనోటితో ధృవీకరించటంఅవయవాల ద్వారా దాన్ని ఆచరించటంవ్యక్తపరచడం - ఇదే విశ్వాసం.''
                                               

ఇస్లామీయ సంస్కృతి - శిక్షాస్మృతి


 ఈప్రపంచం అనేక సంస్కృతుల-శిక్షాస్మృతుల,  కూడలి. ఒక ప్రాంతపు సంస్కృతికి-శిక్షాస్మృతికి మరో ప్రాంతం ప్రభావితం కావడం సహజంగా జరిగే విషయం. ఆది మానవుడైన ఆదం (అ) గారి కాలం నాటి నుండి మొదలయిన ఈ నాగరికతా ప్రస్థానంలో అనూహ్యమైన అలంకారాలనుమార్పులను సంతరించుకుంది సంస్కృతి- శిక్షాస్మృతి. దైవ అంతిమ ప్రవక్త ముహమ్మద్‌  (స) వారి రాకతో పరిపూర్ణతను సంతరించుకున్న సంస్కృతి- శిక్షాస్మృతులు తన స్పష్టమైన ఆకృతి ప్రభావాన్ని ప్రపంచం మొత్తం మీద వేశాయి.
 సంస్కృతి-శిక్షాస్మృతి ప్రభావంపైనసంస్కృతి-శిక్షాస్మృతి ప్రస్థానంపైనసంస్కృతి-శిక్షాస్మృతి ప్రామాణికతపైనసంస్కృతి-శిక్షాస్మృతి మూలాలపైన అనేక పరిశోధనలు జరిగాయిజరుగుతున్నాయి. పుస్తకాల రూపంలో మనకు అందుతూనే ఉన్నాయి.  మనం నిత్య జీవితంలో అలవోకగా ఆచరించే ఎన్నో అలవాట్లనుఆచారాలనుతీర్పులను తర్కించి వాటి పుట్టపూర్వోత్తరాల గురించిఅన్య సంస్కృతుల-శిక్షాస్మృతుల నుంచి అవి నడిచి వచ్చిన వైనాన్ని విపులీకరించిన అనేకుల నోట మేలిమి సంస్కృతి-శిక్షాస్మృతి గా పంశంస పత్రాన్ని తన సొంతం చేసుకుంది ఇస్లామీయ సంస్కృతి-శిక్షాస్మృతి. అదెలా సాధ్యమయ్యిందిఅంటే ఈ వ్యాసం చదవాల్సిందే.   మనిషి - అతను ఏ ప్రాంతానికి చెందిన వాడైనాఏ మతధర్మాన్ని అవలంబించే వాడైనా అతను జీవించేది మాత్రం రెండు విధమైనటువంటి లోకాలలో. ఒకటి బాహ్య ప్రపంచం. రెండవది భావ ప్రపంచం. కనుక ఈ పుడమిపై పాదం మోపిన ప్రతి మనిషికి సంబంధించిన ఈ ద్విలోకాల అవ సరాలు తీరనంతవరకు అతని జీవితం ప్రశాంతమయం కాజాలదు. బాహ్య ప్రపం చంలో మనిషి మేధకు అగ్రతాంబులం ఉంటేభావ ప్రపంచంలో మనసుది అగ్ర భాగం. ఒక్కమాటలో చెప్పాలంటే న్యాయం -త్యాగం అన్న గుణాలు ప్రతి సమాజపు మనుగడకు పునాదిరాళ్ళు. ఈ విషయమై ప్రపంచ చరిత్రనుప్రపంచంలోని శిక్షా స్మృతులను పరిశీలించినట్లయితేమహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి ఆవిర్భా వానికి పూర్వం వరకు ఉన్న పరిస్థి వేరు. ఆయన ప్రభవనం తర్వాతి స్థితి వేరు అన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
     నేడు ఒక వర్గం శిక్షాస్మృతుల విషయం లో ఓ అతివాదానికి గురై ఉంటేమరో వర్గం మన్నింపు విషయంలో ఇంకో అతి వాదానికి గురై ఉంది.  అది శిక్షాస్మృతిలో ని మరణ దండనకు వ్యతిరేకంగా ఎంత ఉధృతంగా ప్రచారం చేసిందంటే చాలా మంది మరణ దండనను అసహ్యకరమ యిందిగా భావిస్తున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు దాన్ని పూర్తిగా రద్దు చేశాయి కూడా. నిజంగా హత్యా ప్రతీకార చట్టంలో సమాజ జీవితం దాగి ఉందనిఏ సమాజమయితే మానవ జీవితాన్ని గౌర వించని వారి ప్రాణాలను ఆదరణీయంగా బావిస్తుందో అది వాస్తవానికి చంకలో విష సర్పాన్నితన మధ్య కనికరం ఎరుగని క్రూర మృగాన్ని పెంచి పోషిస్తున్నదన్న మాట. ఆ సమాజం ఒక హంతకుని ప్రాణాన్ని కాపాడి అనేక అమాయక ప్రజల ప్రాణాలను ప్రమాదానికి గురి చేస్తున్న దన్న మాట అంటూ ఖుర్‌ఆన్‌ బుద్ధి జీవుల ను సంబోధించి హెచ్చరిస్తుంది.   ''ఓ విశ్వసించిన జనులారా! హత్యా వాజ్యాలలో మీకు 'ఖిసాస్‌విధానం విధిం చబడింది. హంతకుడు స్వతంత్రుడయితే ఆ స్వతంత్రుడిపైనే ప్రతీకారం తీర్చుకో వాలిబానిస హంతకుడయితే ఆ బానిసకే మరణ శిక్ష విధించాలిస్త్రీ నేరం చేస్తే ఆ స్త్రీనే శిక్షించాలిఅయితే హంతకుని పట్ల అతని సోదరుడు మన్నింపుల వైఖరి అవ లంబించడానికి సిద్ధ పడితే ప్రసిద్ధ రీతిలో హత్యా పరిహారం నిర్ణయం అవ్వాలి. హంతకుడు  నిజాయితీగా దాన్ని చెల్లించ డం ధర్మం. ఇది మీ ప్రభువు చూపుతున్న రాయితికనికరం. ఇక దీని మీద కూడా ఎవరయినా మితిమీరి ప్రవర్తిస్తే అతనికి బాధాకరమయిన శిక్ష పడుతుంది. బుద్దీ వివేకాలు గల జనులారా! ప్రతీకార చట్టం లోనే మీకు సముజ్జీవనం లభిస్తుంది. మీరు ఈ శాసన ఉల్లంఘనకు పాల్పడకుండా మెలుగుతారని భావించ బడుతోంది''.(అల్‌ బఖర: 178,179) 
  అల్లాహ్  ఈ ఆయతులో హత్యా ప్రతీకారం తీర్చుకునే (మేలిమి మేధ అప్పీిలును) హక్కును ఇవ్వడంతోపాటు మనసు సంబం ధిత సదాచరణను సయితం ఎరుక పర్చాడు. అంటే మనకు ఎదుటి వ్యక్తికి మధ్య పితృ సంహార వైరం ఉన్నప్పటికీ అతనయితే మన తోటి మానవ సోదరుడే కదా. అందువల్ల తప్పు చేసిన ఓ సోదరుని విషయంలో ప్రతీకారాగ్రహాన్ని మింగేశా మంటే అది మనలోని మానవతను ఇతోధి కంగా ప్రతిబింబించే ఘనమయిన విష యం. ఈ ఆయతులో తెలుపబడిన మరో విషయం ఏమిటంటేఇస్లామీయ శిక్షా స్మృతిలో హత్యలాంటి వ్యవహారంలో కూడా రాజీకి ఆస్కారం ఉంది. హతుని వారసుల కు హంతకుణ్ణి క్షమించి వేెసే హక్కు ఉంది. ఇలాంటి సందర్భంలో న్యాయస్థానంహంతకునికి మరణ శిక్ష  విధించవలసిందే నని పట్టుబటడం ధర్మసమ్మతం కాదు,. అయితే హంతకుడు వారు కోరిన హత్యా పరిహారాన్ని విధిగా చెల్లించాల్సి ఉంటుంది. హాత్యా పరిహారం ఇస్తానని ఎగ్గొట్టడమూ దుర్మార్గమేపరిహారం తీసుకుని కూడా మళ్ళి వ్యక్తిని హతమార్చడమూ దౌర్జన్యమే అంటుంది.
 ఈ విషయమై అల్లాహ్‌ా ఇలా సెలవిస్తు న్నాడు: ''నిశ్చయంగా అల్లాహ్‌ా న్యాయ బద్ధ తనుఅనుగ్రహశీలతనుబంధుత్వ అను రాగాన్నీ (పాటించాలని) ఆదేశిస్తున్నాడు. ఇంకా - నీతిబాహ్యమైన పనుల నుండీిచెడుల నుండీదౌర్జన్యం నుండీ ఆయన ఆపుతున్నాడు. మీరు గుణపాఠం గ్రహించ డానికి ఆయన స్వయంగా మీకు ఉపదే శిసున్నాడు''. (అన్‌ నహ్ : 90) ఈ ఆయతులో 'అద్ల్‌అన్న పదం ఉంది. దీని భావనలో రెండు స్థిర యదార్థాలు మిశ్రమమయి ఉన్నాయి. ఒకటి జనుల మధ్య హక్కుల్లో సమతుల్యతసానుకూల ఔచిత్యం స్థాపించబడాలి. రెండు ప్రతి వ్యక్తి కి అతని హక్కు నిష్కర్షగా అందజేయాలి.
  న్యాయం అనగానే సాధారణంగా ఇద్దరి మధ్య హక్కుల విభజన చెరి సగం జరగా లన్న భావన    తప్పుడుగా     ఏర్పడింది. దాని ప్రకారమే ఒక విషయంలో న్యాయం అనగానే సమాన స్థాయి విభజన జరుగు తుందన్న భావన ఏర్పడింది. ఇది మానవ మేధకునైజానికిన్యాయానికి విరుద్ధమైన విషయం. ఎక్కువతక్కువ సేవ చేెసేవారం దరికి సమాన స్థాయిలో వెతనం లభించాల నడం ఎంత మాత్రం సమంజసమైన విష యం కాదు. ఈ విధమైనటువంటి సమాన త్వంసమతా భావాన్ని ఇస్లాం కొన్ని సంద ర్భాలకే పరిమితం చేస్తుంది. ముఖ్యంగా భావోద్రేకానికి లోనై చేసే తీర్పు విషయం లో.ఉదాహరణకు నోమాన్‌ బిన్‌ బషీర్‌ (ర) తెలియజేసిన ఈ సంఘటన ఓ మచ్చు తునక. 'మా నాన్న గారు నాకో కానుక ఇచ్చారు. అది చూసిన మా అమ్మగారుఈ కానుకకు దైవ ప్రవక్త (స) సాక్షిగా ఉండ నంత వరకూ తాను దాన్ని ఒప్పుకోనని అంది. అప్పుడు మా న్నా దైవ ప్రవక్త (స) వద్దకు వెళ్ళి విషయాన్ని వివరించారు. అందుకు ప్రవక్త (స) 'నీవు నీ పిల్లలంద రికీ ఈ కానుకను ఇచ్చావా?' అని దర్యాప్తు చేశారు. 'లేద'ని మా నాన్న గారు బదులి చ్చారు. 'మరయితే అల్లాహ్‌ాకు భయపడు. సంతానం మధ్య న్యాయాన్ని పాటించు. నేను అన్నాయానికి సాక్షిగా ఉండనుఅని చెప్పారు. (సహీహ్  బుఖారీముస్లిం) ఎందుకంటేన్యాయం ద్వారా సమాజం లో శాంతి సుస్థిరతలు నెలకొంటేత్యాగ భావం ద్వారా అంతరంగాల అగాధాలు పూడుకుంటాయి. హృదయాలు హత్తుకుం టాయి. సత్సంబంధాలు పెంపొందుతాయి. ప్రేమానురాగాలు విరబూస్తాయి. ఆత్మీ యత ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. ప్రవక్త (స) వారినుద్దేశించి అల్లాహ్  ఖుర్‌ఆన్‌లో ఇలా సంబోధించాడు:
''(ప్రవక్తా!) ఇది ఎన లేని దైవ కారుణ్యంనీవు వీరి కొరకు ఎంతో మృదుస్వభావిగా అలరారావు. అలా కాక ఒకవేళ నీవు తీవ్ర స్వభావివిపాషాణ హృదయుడివి అయి ఉంటే వీరంతా నీ దరిదాపుల నుండి దూర మయి పొయ్యేవారు. వీరి తప్పుల్ని మన్నిం చు. వీరి కొరకు  క్షమాభిక్ష  వేడుకో..'' (ఆలి ఇమ్రాన్‌: 159)    మేలిమి మేధ కోరే న్యాయాన్ని అమలు పర్చే అధికారాన్ని అల్లాహ్  ప్రసాదిస్తూనే మృదువుగా మెలగడం మరింత మంచిద న్నాడు: ''ఒకవేళ మీరు ప్రతీకారం తీర్చు కోదలచినామీకు ఏ మేరకు బాధ పెట్టడం జరిగిందో ఆ మేరకే ప్రతీకారం తీర్చుకోండి. ఒకవేళ మీరు ఓర్చుకున్నట్ల యితేఓర్పు వహించేవారి పాలిట ఇది ఎంతో శ్రేయస్కరమైనది''.     (అన్నహ్ : 126)
 ''అపకారానికి బదులు అటువంటి అప కారమే. కానీ ఎవరయినా (ప్రత్యర్థిని) క్షమించిసయోధ్యకు వస్తే అతనికి పుణ్య ఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్ ది...''     (అష్‌షూరా: 40)
 ''మేము తౌరాతు గ్రంథంలో వారి (యూదుల) కోసం ఒక శిక్షాస్మృతిని సూచించాము. (దీని ప్రకారం) ప్రాణాని కి బదులు ప్రాణంకన్నుకు బదులు కన్నుముక్కుకు బదులు ముక్కుచెవికి బదులు చెవిపంటికి బదులు పన్ను. అలాగే కొన్ని ప్రత్యేక గాయాల కోసం కూడా (సరిసమానంగా) ప్రతీకారం ఉంది. మరి ఎవరయినా సదఖా (దానం) గా క్షమాభిక్ష  పెడితే అది అతని పాలిట  'కప్ఫారా' (పాపపరిహారం) అవుతుంది''.       (అల్‌ మాయిదా: 45)
        దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ''ఒకరి శరీరాన్ని ఎవరైనా గాయపర్చడం జరిగి అతను దాన్ని మన్నించి వేస్తే అతను చూపిన ఈ క్షమకు సమాన స్థాయిలో అతని పాపాలను క్షమించి వెయ్యడం జరుగుతుంది''.
  మానవుని స్వాభావిక భావోద్రేకాలను ఆరోగ్యవంతమయినవనిపరి శుద్ధమయినవని ఇస్లాం ప్రకటించిన రీతిలో ప్రపంచంలోని మరే మత ధర్మమూ చెప్పలేదు. దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:'జనులకై-మనోభిరామమయిన కాంక్షలుస్త్రీలుసంతానంవెండి బంగారాలుమన్నికయిన గుర్రాలుపశువులు (పాడి)వ్యవసాయ భూములు - ఇవన్నీ మనోజ్ఞంగా చెయ్యబడ్డాయి'. (ఆలి ఇమ్రాన్‌:14)
 షహవాత్‌- అంటే సహజంగా మనిషి ఇష్టపడేఅతని మనసును దోచుకునే వస్తువులు అని భావం. అందుకే ఆ వస్తువులు కోరుకోవ డంవాటి పట్ల మోజు చూపడం తప్పు కాదు. కాకపోతే ఈ విష యంలో మనిషి  మితి మీరకూడదు. షరీతయతు విధించిన హద్దుల ను అతిక్రమించకూడదు. వాటిని మనిషి కొరకు ఆకర్షవంతంగామనోజ్ఞమైనవిగా చేయడం అన్నది కూడా దేవుని తరఫు నుంచి ఓ పరీక్షే. ''మేము మనుషులను పరీక్షించే నిమిత్తం భూమిపై ఉన్నవాటిని మనోజ్ఞమయినవిగా చేశాము''. (అల్‌ కహఫ్‌: 7)
  ఇస్లాం కోరికల దాస్యాన్ని మంచి దృష్టితో చూడదన్న విషయం నిజమే. అది మనిషిపై కళ్ళెం లేని కోరికలుభావేద్రేకాలు అధికారం చెలాయించే వరకు వీటికై అర్రులు చాచడానికి వీలు పడదు అం టుంది. ఎందుకంటే కళ్లెం లేని కోరికలు మనిషిలోని శక్తిసామర్థ్యాల కేంద్రాన్ని సర్వనాశనం చేసి వేస్తాయి. మనిషిని పశు స్థాయికి దిగ జార్చుతాయి. ఈ విషయమై ఇస్లాం వ్యక్తిపై కొన్ని ఆంక్షలు విధించ డానికి కారణం అతను తన స్వేచ్ఛ దుర్వినియోగం చేసి తన స్వయాని కికుటుంబానికిసమాజానికి ఎలాంటి హాని కలుగజెయ్యకుండా ఆనంద మకరందాన్ని గ్రోల గలగాలన్నదే. మనోనిగ్రహంకై చేసే సూచన నిర్బంధ శాసనం కాదు. దీని వెనక ఎంతో నిగూఢ వివేచన దాగి ఉంది. ప్రపంచ సుఖాలను జీవితాశయానికి తగినట్లుగా మలచు కోవడం. ఏ జాతి ప్రజలయితే తమ మనోకాంక్షల్నిభావోద్రేకాలను తమ అధీనంలో ఉంచుకోలేరోమరెవరైతే అవసరం ఏర్పడినా తమకు ప్రియమైన వాటిని వదులుకోవడం ఇష్టపడరో అలాంటి జాతి నాయ కత్వపు హోదాను పొందజాలదు. అలాగే అంతర్జాతీయ సంఘర్షణల్లో ఏ జాతి జనులయితే కష్టాలనుఆపదలను భరించే సామర్థ్యం కలిగి ఉంటారోఎవరయితే అవసరం కలిగినప్పుడు తమ మనోభిరామమ యిన కోరికల్ని గంటలుదినాలే కాదు సంవత్సరాల తరబడి త్యజించి నిబ్బరం చూపగలరో అలాంటి దృఢ సంకల్పులకేఉత్తములకేపురుషోత్తములకే విజయశ్రీ కాళ్ళు పడుతుంది. ఇక పిచ్చి స్వేచ్ఛ కోసం మనసిచ్చిన  మనిషిఒక ఉన్నతాశయం కోసం కొన్ని గంటల యినా తన మనోకాంక్షల పొగరుబోతు గుర్రాన్ని కళ్ళెం వెయ్యలేని మనిషి కూడా ఒక మనిషేనాఇటువంటి కాంక్ష దాసులు మానవాళికి ఎన్నడూ ఎలాంటి సెవనూ చెయ్యలేరు. తనకు ప్రియమైన విలాసాలను త్యాగం చేసే సాహసించలేరు.    ఇస్లాం సాధించిన మహత్కార్యాల్లోమహాద్భుతాల్లోఅలనాటి అరబ్బు ఆటవికఅనాగరికమొరటు ప్రజల్ని సంస్కారవంతులయిన మానవుల సంఘంగాఓ ఉత్తమ జాతిగా తీర్చిదిద్దడం ఒకటి. అది వారికి కేవలం రుజుమార్గం మాత్రమే చూపలేదు. కేవలం వారిని పాశవిక స్థాయి నుండి లేవనెత్తి వారికి మానవత్వపు ఉన్నత విలువల ను పరిచయం చెయ్యడమే కాదువారిని ఇతరులకు మార్గదర్శకుల గాదైవ ధర్మధ్వజవాహకులుప్రచారకులుగా కూడా తీర్చిదిద్దింది.
మచ్చుకు కొన్ని సంఘటనలు: ఉహద్‌ సంగ్రామం అనంతరం హజ్రత్‌ హమ్జా (ర) గారి మృత దేహం ముక్కలు ముక్కలుగా ఖండించబడిచెవులుముక్కు కోయ బడి ఎంతో భయంకరంగాకడు దయనీయంగా ఉంది. దాన్ని చూడగానే దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి కళ్ళలో గిర్రున నీళ్ళు తిరి గాయి. ఆవేదనాభరితమైన ఆయన హృదయం నుంచి సన్నగా (ఈ క్రింది) శబ్ద తరంగిణి జాలువారింది. 'అబ్బా! ఇంతటి దారుణమైన దృశ్యం నేనింత వరకు చూడలేదు. హమ్జా సోదరి సఫియా మనసు బాధ పడుతుందన్న భయమే గనక లేకపోయి ఉంటేఈ పని నా అనంతరం అనవతర ఆచారంగా మారుతుందేమోనన్న భయమే గనక లేకపోయి ఉంటే నేను హమ్జా దేహాన్ని ఇలాగే గద్దలకుమృగాలకుక్రీమికీటకాలకు వదిలి పెట్టేవాడ్ని. ప్రళయ దినాన తాను ఆయా ప్రాణుల పొట్టల నుండి లేప బడేవాడు . (అబూ దావుద్‌తిర్మిజీ)   
  పై సంఘటనలో భావోద్రేకాల వెల్లువ కట్టులు తెంచుకోబొతుండగా వెలువడి మాటలు అవి. అయితే మహా ప్రవక్త ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు భావోద్రేకాల ప్రవాహంలో కొట్టుకుపోలేదు. న్యాయానికికరుణకి కట్టు బడ్డారు. ఆయన హమ్జా మృతదేహాన్ని ఖననం చేశారు.
 హజ్రత్‌ అలీ (ర) గారి కథనం - దైవ ప్రవక్త (స) వారు కొందరిని సైనిక చర్యల నిమిత్తం పంపిస్తూవారికి నాయకునిగా ఒక అన్సారు వ్యక్తిని నియమించిఅతని పట్ల విధేయత కనబర్చవలసిందిగా పుర మాయించారు. (ప్రయాణం మధ్యలో ఏదోక కారణంగా) ఆ వ్యక్తి అగ్ర హోదగ్రుడయ్యాడు. (కోపంతో ఊగిపోతూ) 'ఏమీ! నా పట్ల విధేయత కనబర్చమని ప్రవక్త(స)వారు చేసిన హితవు   నిజం కాదా?' అన్నాడు. అందరూ నిజమే అన్నారు ముక్తకంఠంతో. అలాగయితే నా ఆజ్ఞ  మేరకు కట్టెల్ని ప్రోగు చేయండి. వారు మారు మాట్లాకుమడా కట్టెల్ని ప్రోగు చేశారు. వాటికి నిప్పంటించండి అని మళ్ళి గర్జించాడు. నిప్పం టించడం జరిగింది. అవి బాగా కాలాక-అందరినీ ఉద్దేశ్యించి 'నేనాదే శిస్తున్నాను మిమ్మల్ని మీరు ఈ అగ్నికి ఆహుతి చేసుకోండిఅని అరిచాడు. అందరూ అయోమయంలో పడ్డారు.  
  ఒకరు మరొకరిని పట్టి లాగనారంభించారు. ఈ అగ్నికి ఆహుతి అవ్వడంకన్నా ప్రవక్త (స) వారి కారుణ్య సన్నిధికి పారిపోడం మేలని భావించారు. నిప్పు పూర్తి ఆరిపోయేంత వరకు వారి స్థితి అలానే ఉంది. చివరికి మంటా చల్ల బడిందిఅతని కోపమూ తగ్గింది. ఈ విషయం తర్వాత కారుణ్యమూర్తి(స) వారి కర్ణపుటాలకు చేరింది. సాంతం విన్న కారుణ్యమూర్తి (స) ఇలా అభిప్రాయపడ్డారు:  ''ఒకవేళ వారు అతని మాటననుసరించి అగ్నికి ఆహుతి అయ్యుంటే ప్రళయం వరకు దాన్నుండి బైటకు రాగలిగేవారు కాదు. విధేయత అన్నది మంచి కార్యాల్లో మాత్రమే సుమీ!'' అని మందలించారు.  (బుఖారీముస్లిం) 
  పై సంఘటనలో మనసు ప్రవక్త (స) వారి ఆజ్ఞను గౌరవిస్తూ నాయకుని మాటకు విధేయత చూపాలని పదే పదే చెబుతున్నామేలిమి మెదడు దాన్ని నిరాకరిస్తోంది. ప్రేమకు నిలయమైనకరుణకు ఆలయమైన ఇస్లాం ధర్మంలో మేధకు మింగుడు పడని విషయానికి విధేయత చూపాలన్న ఆజ్ఞ  ఎలా ఉండగలదుఅని ప్రశ్నిస్తోంది. కాబట్టి అట్టి సందర్భాలు ఎవరికి ఎప్పుడుఎక్కడ ఎదురయినా భావోద్రేకానికి లోనయి ధర్మం కోరని త్యాగానికి పూనుకోవడం మాని ధర్మం అంగీకరించిన మేలిమి మేధ చూపే న్యాయానికి కట్టుబడాలని దైవప్రవక్త (స) సెలవిచ్చారు.
    ఇస్లాంలో ఆరాధనా గృహాన్ని నేలమట్టం చేయడంఅటువంటి కట్టడానికి నష్టం చేకూర్చడంఅందులో ఆరాధన నుండిదైవనామ స్మరణ నుండి జనులను ఆపడంషరీయతు ఆదేశాలను పాటించ కుండా నిరోధించడం ఇత్యాదివన్నీ నిషిద్ధం. అయితే ఆరాధన కోసం కాక కేవలం ముస్లింల మధ్య గల ఐకమత్యాన్ని నీరుగార్చే దురుద్దేశ్యం తో నిర్మించబడే మస్జిద్‌ను విద్వాంసులు 'మస్జిదె జిరార్‌'గా అభివర్ణిం చారు. కాబట్టి ముస్లింలలోని చీలికను నివారించడానికీవారి సంఘ టిత వ్యవస్థకు విఘాతం కలుగకుండా ఉండటానికి అటువంటి మస్జిద్‌ లను కూల్చివేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదని ఖుర్‌ఆన్‌లోని ఓ ఆయతు ద్వారా రూఢీ అవుతుంది. సాధారణంగా ఇటువంటి వాటిని మస్జిద్‌ పట్ల మర్యాద గల మనసు అంగీకరించదు. అయితే మేలిమి మేధ చూపే న్యాయానికి అనుగుణంగానే అల్లాహ్‌ా ఈ  ఆదేశాన్ని అవ తరింపజేశాడు: ''(కపటులలో) మరికొంత మంది కూడా ఉన్నారు - కీడు కలిగించేఅవిశ్వాసం కూడిన మాటలు చెప్పుకునే ఉద్దేశ్యంతోవిశ్వాసుల మధ్య చీలికను తెచ్చే లక్ష్యంతోఅంతకు మునుపు అల్లాహ్‌ానుఆయన ప్రవక్తను వ్యతిరేకించిన వ్యక్తికి ఆసరా ఇచ్చే ఆలోచనతో వారు ఒక మస్జిదు నిర్మించారు. (ఈ కట్టడాన్ని నిర్మించటంలో) తమ ఉద్దేశ్యం మేలు చేయడం తప్ప మరొకటి కాదని వారు ప్రమాణాలు చేస్తారు. వారు అబద్దాలకోరులన్న విషయానికి అల్లాహ్  సాక్షి''. (అత్‌ తౌబా: 107) 
వివరాల్లోకెళితే-కపటులు ఒక మస్జిదు నిర్మించారు. వర్షాలు కురుస్తున్నప్పుడుచలి గాలులు వీస్తున్నప్పుడుతీవ్రమైన ఎండ పడుతన్నప్పుడు తమలోని బలహీనులువృద్ధులు దూరం నుంచి మస్జిదె నబవీ వరకూ రావడం కష్టంగా ఉందనీవారి సౌలభ్యం కోసమే తాము మరొక మస్జిదును కట్టామని వారు దైవప్రవక్త (స) వారిని నమ్మబలకడంతోపాటుతమరు గనక ఒకసారి వచ్చి అందులో నమాజు చేస్తే ఎంతో శుభం చేకూరు తుందని విజ్ఞప్తి కూడా చేశారు. కాని ఆ సమయంలో ప్రవక్త (స) తబూక్‌ యుద్ధానికి బయలుదేరుతున్నారుప్రయాణ నుంచి తిరిగి వచ్చాకఅక్కడికి వచ్చి నమాజు చేస్తానని వాగ్దానం చేశారు. అయితే తబూక్‌ నుండి తిరిగి వస్తున్నప్పుడు అల్లాహ్ వహీ ద్వారా ఆ మస్జ్జిద్‌ వెనుక ఉన్న దురుద్దేశాలను బట్టబయలు చేశాడు. ముస్లింల మధ్య మనస్పర్థలను సృష్టించడంఅవిశ్వాసాన్ని వ్యాపింపజేయటందైవానికిదైవప్రవక్తకు శత్రువుగా వ్యవహరిస్తున్న వారి కోసం ఆసరాను సమ కూర్చడం వారి ఉద్దేశ్యం అని తెలియజెయ్యడమేకాక లోగడ నువ్వు చేసిన వాగ్దానాన్ననుసరించి ఆ మస్జిద్‌కు వెళ్ళకు అని ఆదేశించాడు కూడా: ''నువ్వు ఎన్నడూ అందులో నిలబడకు. అయితే తొలినాటి నుంచే దైవభీతి-తఖ్వా పునాదిపై నిర్మించబడిన మస్జిదు నువ్వు నిల బడటానికి అన్ని విధాలా తగినది. బాగా పరిశుద్ధతను పొందటాన్ని ఇష్ట పడేవారు అందులో ఉన్నారు. బాగా పరిశుద్దతను పాటించేవారిని అల్లాహ్  ప్రేమిస్తాడు''. (తౌబా:108) 
 ముస్లింల మధ్య మనస్పర్థల్ని సృష్టించే ఉద్దేశ్యంతో నిర్మితమైన ఎలాంటి విగ్రహ ప్రతిమలు లేని మస్జిద్‌లలోనే నిలబడకూడదువాటిని కూల్చేయాలని అల్లాహ్  అదేశిస్తున్నప్పుడునేడు ముస్లింల విశ్వాసానికి తూట్లు పొడవాలన్నవారి పురోభివృధ్దిని అసలు కారక మైన తౌహీద్‌ను అడుసులో తొక్కెయ్యాలన్న ఉద్దేశ్యం పునాదిగా కుత్సిత మతుల కుయుక్తులతో నిర్మించబడిన శవాలు పూడ్చబడిన దర్గాల గురించి ఇస్లాం ఎలాంటి ఆదేశాలు కలిగి ఉంటుందో సుమతులైన సమాలోచనాపరులు సునిశితంగా ఆలోచించాలి. అలాగే పాక్షికమైన కొన్ని విభేదాలను ప్రధానమయినవిగా చిత్రీకరిస్తూ కేవలం దైవారాధన కోసం నిర్మించబడే మస్జిద్‌లను కూల్చడంకాల్చడం ఎంతటి భయం కర నేరమో యోచించాలి. అదే పని ఒక ముస్లిమేతరుడు చేస్తే కాఫిర్‌ (అవిశ్వాసి-తిరస్కారి)నరకవాసి అని ఫత్వాలు జారీ చేసే పండిత మహాశయులు ఆయా సమాధుల్లో గల వ్యక్తుల పట్ల అభిమానంతో భావోద్రేకాలకు లోనవ్వకుండా ధర్మం చెప్పే తీర్పుకిచూపే న్యాయాని కి తల వంచాలి. అలా వంచిన నాడే మళ్ళీ ముస్లిం సమాజం నిండు స్వేచ్ఛతో తలెత్తుకుని పురోగమనం వైపు సాఫీగా అడుగెయ్యగలదు. ఇహంలో విజేతగా నిలిచిపరంలో స్వర్గవాసిగా నీరాజనాలందుకొ గలదు.
ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: 'ఓ అజ్ఞానుల్లారా! అల్లాహ్ ను వదలి ఇతరుల ను పూజించమని మీరు నాకు ఆజ్ఞాపిస్తున్నారా?' అని ఓ ప్రవక్తా వారిని అడుగు. నిశ్చయంగా నీ వద్దకునీకు పూర్వం వచ్చిన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం ఇది: ''ఒకవేళ నువ్వు గనక బహు దైవారాధన (షిర్క్‌)కు పాల్పడితే నువ్వు చేెసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయిన వారిలో చేర్తావు. కాబట్టినువ్వు మాత్రం (ఒక్కడైన) అల్లాహ్ నే ఆరాధించు. అనంతరం అనవతరం కృతజ్ఞతలు తెలుపుకునే వారిలో చేరిపో''. (జుమర్‌: 64-66)        

తఖ్వా

తఖ్వా లాభాలు (తఖ్వా ప్రయోజనాలు):
 తఖ్వా మార్గం చాలా కఠినమైన మార్గం. ముళ్ళులతో నిండున్న మార్గం. ఆ మార్గంపై నడిచేవారు సైతం ఎన్నో కష్టాలను ఎదుర్కొం టారు. చివరికి పరలోకంలో నిశ్చయంగా వారు ఉద్యానవనాలలో ఎల్లప్పుడు హాయిగా ఉంటారు. దివ్యఖుర్‌ఆన్‌ అధ్యయనం ద్వారా తెలిసేదే మంటే దైవం పరలోకపు సర్వ అనుగ్రహాలను దైవభీతి గలవారికే తయారు చేసి పెట్టాడు. దివ్యఖుర్‌ఆన్‌లో పలు చోట్లలో దీని గురించి ప్రస్తావన వచ్చింది.''నిశ్చయంగా భయభక్తులు గలవారు సురక్షిత మైన స్థలములో ఉంటారు''.(అల్‌దుఖాన్‌:51) 
ఇంకో చోట ''నిశ్చయముగా భయభక్తులు కల వారు ఉద్యావనాలలోభోగభాగ్యాలలో ఉం టారు''. (అల్‌ తూర్‌:17) మరో చోట ఈ విధంగా ఉంది: ''నిశ్చయముగా భక్తులు స్వర్గ వనములలో కాలువలలో ఉంటారు''. (జారియాత్‌:15)అదే విధంగా ''నిశ్చయముగా భయభక్తులు గలవారికి వారి ప్రభువు వద్ద సౌఖ్యములు గల స్వర్గవనములు తప్పక గలవు.''  (అల్‌ కలమ్‌ : 34) ''నిశ్చయముగా భయభక్తులు గలవారికే సాఫల్యము గలదు.'' (అన్‌ నబా: 31)
పరలోకంలో  దైవభీతి గలవారికి ఓ వెలుతురు ప్రసాదించడం జరుగుతుందిదాని ద్వారా వారు తమ పరలోక ప్రయాణాన్ని సాగి స్తారు.''ఓ విశ్వాసులారా! దేవునికి భయపడండిమరియు అతని ప్రవక్తను విశ్వసించండిఅల్లాహ్‌ా మీకు తన అనుగ్రహము నుండి రెండు భాగములు ప్రసాదిస్తాడుమీకు వెలుతురు సైతం ప్రసాది స్తాడు. దానిద్వారా మీరు నడవగలరుమరియు మిమ్మల్ని క్షమిస్తాడు కూడా. అల్లాహ్‌ా క్షమించేవాడు అనుగ్రహించేవాడు.''(అల్‌హదీద్‌:28)
కేవలం పరలోక ప్రయోజనాలే కాకుండాఇహలోక లాభాలు సైతం ప్రాప్తమవుతాయి. వాటిలో కొన్ని ఇవి: అల్లాహ్ ప్రేమ: అల్లాహ్  ప్రసన్నత కొరకు దైవభీతి మరియు పరిశుద్ధమైన జీవితాన్ని అవలంబించే వ్యక్తి అల్లాహ్ కు ప్రియమైన వాడని దివ్య ఖుర్‌ఆన్‌ తెలియజేస్తుంది. ''అల్లాహ్  భయభక్తులు గల వారంటేనే ఇష్టపడతాడు''. (తౌబా:4)
అల్లాహ్  సాన్నిధ్యం: తఖ్వా యొక్క జీవితాన్ని అవలంబించటం వల్ల దైవ సాన్నిధ్యం సైతం ప్రాప్తమవుతుంది. ''అల్లాహ్ కు భయ పడుతూ ఉండండిభయభక్తులు గలవారితోనే అల్లాహ్  ఉంటాడు అనే విషయం తెలుసుకోండి''.      (అల్‌ బఖర:194)
ఉపాధి లభించే మార్గం: దైవం దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా సెలవిస్తు న్నాడు: 'ఏ వ్యక్తి అయితే అల్లాహ్ కు భయపడతాడోఅల్లాహ్  అతనికి గట్టెక్కే మార్గాన్ని చూపుతాడు (ముక్తిమార్గము కల్పిస్తాడు) మరియు అతనికి తెలియని మార్గం ద్వారా ఉపాధి ప్రసాదిస్తాడు'. (అల్‌ తలాఖ్‌: 2,3)
గీటురాయిని ప్రాప్తిపాపాల మన్నింపు: అల్లాహ్  తన భయభక్తుల ను అవలంబించేవారికి ఓ విచక్షణా శక్తి ప్రసాదిస్తాడు. దాని ద్వారా అడుగడుగునా వారికి స్వయంగా తెలుస్తూ ఉంటుంది. ఏ మార్గం సత్యమైనదోఏది అసత్యమైనదో. ''విశ్వసించిన ప్రజలారా! మీరు గనక భయభక్తులను అవలంబిస్తేఅల్లాహ్  మీకు గీటురాయిని ప్రసా దిస్తాడుమీ నుండి మీ చెడులను దూరం చేస్గాడు. మీ తప్పులను మన్నిస్తాడు. అల్లాహ్  అత్యధికంగా అనుగ్రహించేవాడు.'' (అన్ఫాల్‌:29)
సదాచారాల స్వీకరణ: ఆచారాలు దైవ సమక్షంలో స్వీకరించబడ టానికి తఖ్వాయే పునాది. ''భయభక్తులు గలవారి మొక్కుబడులనే (ఆచారాలనే) అల్లాహ్  స్వీకరిస్తాడు.'' (అల్‌ మాయిదహ్‌ా:27)
గౌరవప్రాప్తి: అల్లాహ్  దృష్టిలో తఖ్వాయే అసలైన ప్రమాణం. ఆ తఖ్వా ద్వారా దాసుడు శ్రేష్ఠమైన స్థాయి పొందగలడు.భయభక్తులు గలవారికే సర్వ రకాల సాఫల్యంప్రతిఫలం లభిస్తుంది. పరలోక లాభాలే కాకుండా ఇహలోక సాఫల్యం సైతం ప్రాప్తమవుతుంది. సూర యూసుఫ్‌ అధ్యయనం చేస్తే మనం గ్రహించే నీతి ఏమంటే ప్రవక్త యూసుఫ్‌ (అ) అధికార పీఠం అధిష్టించాక ఆయన (అ) సోదరులం దరూ లేమిలో ఆయన వద్దకు వచ్చి విన్నవించుకున్నారు. ప్రవక్త యూసుఫ్‌ (అ) తమ సోదరులను సంభాషిస్తూ తన పరిచయం చేశాక తన సాఫల్యానికి కారణమయిన మౌలిక రహస్యాలను పేర్కొన్నారు.''వాస్తవం ఏమిటంటే భయభక్తులతోఓర్మితో వ్యవహరించే సత్పురుషుల ప్రతిఫలం అల్లాహ్  వద్ద వృధా కాదు.'' (యూసుఫ్‌ :90)

గివ్మీ సమ్ సన్ షైన్



బాల్యం - జగం మరచిన నవ్వులు బాల్యం. చెరువుల్లోచేలల్లోమేళల్లోపచ్చని తొట ల్లోపాతబడ్డ కోటల్లో ఉరుకులుపరుగులు బాల్యం.  అమ్మ పెట్టే ముద్దల్తోఅమ్మమ్మ చెప్పే కథల్తో,  నాన్నమ్మ ఇచ్చే ముద్దుల్తోతాత తెలిపే నీతుల్తోనాన్న ఇచ్చే గిఫ్టుల్తో సర దాగాసంతోషంగా సమయం గడపటం బాల్యం. ముఖంపై కల్మషం ఎరుగని మంద హాసం ఉంటుంది.  మదిలో ఆటలాడుకోవాలన్న ఉత్సాహం ఉంటుంది. మైలుదూరమ యినా బడికెళ్లడంలో అంతులేని ఆనందం ఉంటుంది. కొబ్బరుండ పంచుకొవడంలో ...పిప్పర్‌ మెంట్‌ బిళ్లలు చప్పరించడంలో అనిర్వవచనీయమయిన మధురానుభూతి ఉంటుంది. అందరూ తనవారేపరాయి వారే లేరన్న సంతృప్తిసాత్వికత ఉంటుంది. బడి పంతులు గారి ప్రశంసపై మక్కువ ఉంటుంది. బడి వదలగానే మళ్ళీ ఆడుకోవచ్చ నే ఆశ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటేబాల్యం మన స్తోమతకొద్దీ మనం పరి పూర్ణంగా పొందినది. పరవశంతో మళ్ళీ మళ్లి తలచుకునేది! ఈ కారణంగానే -           'యే దౌతలత్‌ భీ లేలోయే షొహ్ రత్‌ భీ లేలో,    భలే ఛీన్లో ముఝ్సే మేరీ జవానీ. 
                           మగర్‌ ముఝ్కో లౌటాదో బచ్‌పన్‌కా సావన్‌ ,      వో కాగజ్‌కి కిష్తీ వో బారిష్‌కా పానీ.....'
అంటూ తన బాల్యాన్నే స్మరించుకున్నాడో కవి. 
పిల్లల లోకం మనకు తెలియని లోకమేం కాదుబాల్య స్మృతులు లేని పెద్దలుండరు. అయితే వయసు మీద పడేకొద్దీబరువు బాధ్య తలు పెరిగేకొద్దీ మన బాల్య స్మృతులు మసక బారడం మొదలవుతాయి. చివరికి మమకారా న్ని మరచి గుండెను బండలా మార్చుకుని మన కలల పంటల్నే మనం నిర్లక్ష్యం చేస్తుం టాముస్వేచ్ఛగా తిరిగే తూనిగని చిన్నతనం లో దారం కట్టి ఆడిన సంఘటన మీకు గుర్తే ఉంటుంది. అప్పుడు మనకు ఆ చిన్న ప్రాణి బాధ అర్థం కాలేదు. అసలు దానికో మనసుం టుందనిదానికీ బాధ కలుగుతుందనిగాని అప్పుడు మనకు తెలీదు.  ఇప్పుడు మనం ఎది గాము. తెలివివంతులం అయ్యాము. ఇప్పుడు మన పిల్లల కళ్లల్లో సునిశితంగా చూసినట్ల యితేమనం వారిపై వేస్తున్న అధిక భారాని కిఒత్తిడికి తట్టుకోలేక - ఇకనయినా వదిలి పెట్టమనే అభ్యర్థన కనబడుతుంది.పిల్లలు మర మనుషులు కారుచెప్పినవన్నీ చెప్పినట్టు వల్లె వేయ డానికి. బాల్యం అంటే కాంపిటేటివ్‌ స్పిరిట్‌ పేరిట క్లాసు రూముల్లో కుక్కి శ్వాస   ఆడని రీతిన నలిపేయడం కాదు. ట్యూషన్ల పేరిట ఉన్న ఆ కాస్త సమయాన్ని కూడా మింగేయ డం కాదు. వారి చిట్టిపొట్టి ఇష్టాలను అదిమేసిస్వేచ్ఛను చిదిమేసి డాన్సులుపాటలు నేర్పడం కాదు. మార్కులు...కాదు..కాదు...ర్యాంకులు తెచ్చుకుంటే ముద్దులు...లేదంటే గుద్దులు..ఇది కాదు వాత్సల్యం. భవిష్యత్తు పట్ల భయంతో బాల్యాన్ని తాకట్టు ప్టెడం కాదు ప్రేమంటే. వారి బాల్యాన్ని వారి నుండి బలవంతంగా లాక్కోవడం కాదు. మన ప్రేమ తోడుగావాత్సల్య నీడగా వారిని స్వేచ్ఛగా ఎదగనిద్దాం! వారి జీవితం సాఫీగా సాగిపోవడానికివిజ్ఞాన సముపార్జనకు కావాల్సిన చదువు  చాలా అవసరం. కానీవేట...వేట..ర్యాంకుల వేట..అంతులేని ఆశల వెంపర్లాట. అందుకోలేని నిరాశలో కుంగుబాట. నిస్పృహ లోనయి మరణ వాత. ఈ పోటీలో జరగరానిది జరిగితే తల్లిదండ్రులకు గుండె కోత! ఎందుకీ రోత! వినండి! పైకి చెప్పలేక మధన పడే ఆ హృదయాల ఘోష!
           తొలి అడుగయినా పడలేదే       అలిసిందా నా పయనం
            ఇంకా మొదలయినా కాలేదే     ముగిసిందా పురాతం
            లేనే లేదా నా కోసం             ఏనాడు ఏ అవకాశం
            కన్నెదురుగా ఉన్నా సరే           కనరాదుగా నాకే నేను
            దారిని చూపే ప్రతి దీపం        మంటయి పోతుంటే
            చినుకే ఇవ్వని ఆకాశం          చిగురించాలనుకుంటే.....
ఒక స్వాతి చినుకు భవితవ్యం అది పడే స్థానంపై ఆధార పడి ఉంటుంది. కాలుతున్న ఇనుము మీద ఆ నీటి చుక్క పడితే క్షణాల్లో ఆవిరయిపోతుంది. తామరాకు మీద పడితే కొంత కాలం పాటు మెరుస్తుంది. అదే ఒక ఆల్చిప్పలో పడితే ముత్యమయి విలువని సంతరించుకుంటుంది.  ఈ ఉదాహరణకీ పిల్ల జీవితానికి అవినాభావ సంబంధం ఉంది. అంటే పిల్లల్లో సయితం మూడు రకాలు. 1) ఆల్చిప్పలో పడిన స్వాతి చినుకులా బాల్యం  నుండే గొప్ప విలువలతో   
  జీవించిమంచి స్థాయికి చేరుకుని ఇంకా ఆద ర్శంగా బ్రతికేందుకు ప్రయత్నిస్తూ జీవించే వారు. 2) పెద్దలకున్న పలుకుబడితోనోమరో మార్గాననుసరించో వీరు పైకి వస్తారు. కానీ తామరాకుపై నీటి బొట్టులా వీరి జీవితం మొదట తళతళలాడినా కొంతకాలానికి కళా హీనమయిపోతుంది. 3) ప్రారంభ థలోనే జీవితానికి విలువ ఇవ్వని వీరు పెరిగేకొద్దీ వ్యసనాలుగొడవలుఅల్లర్లు అలజడులకు పాల్పడుతూ జీవితంలో ఉత్సాహంఉల్లాసాన్ని కోల్పోయి జీవచ్ఛవాల్లా మిగిలిపోతారు. కాలు తున్న ఇనుము మీద పడిన నీటి చుక్క ఆవిర యిపోయినట్టు వీరి జీవితాల్లోని శాంతిసం తృప్తి హరించుకుపోతుంది. ఒకవేళ ఇటువంటి వ్యసనపరులు అదృష్టం కలిసొచ్చి హీరోలయి నా చివరికి మాత్రం జీరోలుగా మిగిలిపోతారు.
 ఇక్కడ తల్లదండ్రులుగా మనం గమనించాల్సిం దేమిటంటేఒక పొలంలో కలుపు మొక్కలుపిచ్చి మొక్కలు విచ్చలవిడిగా పెరిగి మంచి పైరు నాశనమయిందంటే తప్పు పైరుది కాదు. ఆ తప్పు కలుపు మొక్కలదీ కాదు. ముమ్మాటికి ఆ తప్పు రైతుదే అన్న యదార్థాన్ని మనం అంగీకరిస్తాం కదా! అలాగే మన పిల్లలు గొప్పవారుగా ఎదిగినామధ్యములుగా మిగిలిపోయినాఅధములుగా తయారయినా అందుకు కారణం వారొక్కరే కాదు. మనం కూడా కారకులమేసమాన స్థాయి భాగస్వాములమే. కుటుం బ పెద్దలమయిన మనం పిల్లలు ఎదిగేకొద్దీ తోటి పిల్లల నుంచిపరిసరాల నుంచిపాఠశాలల నుంచి వారు సమకూర్చుకున్న జ్ఞానాన్ని సమన్వయంగా ఉపయోగ పడేలాఅది సత్యబద్దంగా ఉండేలా చూడాలి. ఉచితానుచితాల విచక్షణా జ్ఞానాన్ని వారికివ్వాలి. పిల్లలు మన గుమ్మానికి కట్టుకునే ఆకులోపూలో కారు. కుటుంబం అనే చెట్టు నుంచి జీవన చైతన్యాన్ని ఆస్వాదిస్తూ విచ్చుకునే మొగ్గలు. ఆ చెట్టులోని ఒక్కో రెమ్మఒక్కొక్క కొమ్మఒక్కొక్క ఆకు ఉపయోగదాయ కమయినట్టేపువ్వయి విరబూసి పండుగా మారిన మన సంతానం  నుండి సయితం దాని మధురామృతం జాలువారుతుందిఆ ఫల విత్తనమే తన నైజం దృష్ట్యా మరో మహావృక్ష సృజన కు కారణమవుతుంది.
కాబట్టి తల్లిందండ్రులుగా మనం మనోహరమయిన ఈ పూదోటను కాపాడుకోవాలంటే అందు కు తగిన శ్రమ పడాలి. తోటమాలిలా కష్టించి పిల్లల్ని పెంచాలి.సారవంతమయిన నేలపరిశు ద్దమయిన గాలినీరు అందమయిన తోటకు ఆలంబన. సూర్యుడు వాటి ఊపిరి. ఈదురు గాలులుపెనుతుఫానులుఈ వృక్షాల పోరాట పటిమను ద్విగుణీకృతం చేసే సాధనాలు. తోట లో ఒక్క చెట్టు ఎదిగి ఫలసాయాన్ని ఇవ్వాలంటే అందుకు ఇన్ని శక్తులు సహకరించాలి మరి. అంటే తోటమాలులమయిన మనం ప్రేక్షక పాత్ర వహిస్తామని కాదు. అసలు పిల్లలు సరిగ్గా ఎదగడానికి మూల కారకులం మనమే. అలా కాకమన కలల పంటలతో రోజుకో అరగంట యినా గడపడానికివారి మనోభావాల్ని అర్థం చేసుకోవడానికి సమయం లేనంత బిజీలోమనం ఉంటే...రేపు వారికి చెప్పి ప్రయోజనం ఉండదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుందాములే అనోరోగం వచ్చాక వైద్యం చేయిద్దాములే అనో నిర్లక్యం చేయకూడదు. ఆకులు పట్టుకునే గత్యంతరం రాకుండామహమ్మారి రోగాన్ని భరించే దుస్థితి ఎదురవకుండా ముందే జాగ్రత్త పడాలి.
  నేడు ఎంతో మంది గొప్ప ప్రతిభ గల పిల్లలు మన కళ్ల ముందే ఉన్నా కూడా మనం వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించే స్థితిలో లేము. కారణం ఆ పిల్లల్లో ఆ యువకు ల్లో గల అల్లరే. ముఖ్యంగా యువకుల్లో టీజింగ్‌ చేెసే స్వభావం ఉంటుంది. వారికి భవిష్యత్తును భూతద్దంలో చూపించి బెదరగొట్టాలనుకునే ఆలోచనకు స్వస్తి పలికి జీవితాన్ని ప్రేమించడంజీవిత మకరందాన్ని ఆస్వాదించడం నేర్పాలి. ఒకవేళ పిల్లలు మన వద్దకొచ్చికామర్స్‌ గురించిగ్లామర్స్‌ గురించిసెక్స్‌ గురించిసెన్సెక్స్‌ గురించిప్రేమ గురించిపెళ్ళి గురించిసామాజికరాజకీయజాతీయఆంతర్జాతీయ అంశా లగురించిగానీ చర్చించినప్పుడు - మనం విసుక్కోక అసలు వాళ్ళు మనల్నే ఎందుకు సంప్రతించారుమన పట్ల గౌరవంనమ్మకం లేకపోతే వారు మనతో ఇలా అడిగే వారాఅని పేరెంట్స్‌గా కాక ఫ్రెండ్స్‌గా ఆలోచించాలి. మనల్ని వారు ఫ్రేమిస్తున్నారుమన మాటకు విలువ ఇస్తున్నారు కాబట్టే వారి సమస్యలను మనతో వచ్చి చెప్పుకుం టున్నారు. కన్నవారమయి మనమే వారి మనోభావాల్ని అర్థం చేసుకోకపొతే పాపం వారెక్కడికెళతారువారు పడ్డారు నిజమేకానీ మనం వారికి చేయందించి లేపాలి. మన సంతానం మా నుండి కోరుతున్నదేమిటిమీరు కాంతి మూలాలు. శాంతి మూర్తులు. గివ్‌ మీ సమ్‌ సన్‌ షైన్‌ - నాకు కాస్త  వెలుగుకాసిన్ని కిరణాలు కావాలి......నాకు మరో అవకాశం కావాలి నేను మళ్లీ ఎదగాలి!!