31, డిసెంబర్ 2013, మంగళవారం

కాలం పరిణామశీలం


కాలమనే కడలిలో మరో కెరటం లేచింది. మానవ చరిత్ర మరో మైలు రాయి దాటింది. చరిత్రలో ఏ సంవత్సరానికా సంవత్సరం ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటుంది. కొత్తదనం అంటే చిత్తానికి ఎప్పుడూ ఉత్తేజమే. పాత జ్ఞాపకల స్థానంలో రానున్న భవిష్యత్తును ఊహించుకుంటూ రాబోయే సమయం సంతోషంగా గడవాలని కోరుకుంటాడు మనిషి. ఉషాకాంతుల వంటి పసిడి కలలతో మిసిమి భవితవ్యానికి సుస్వాసగం పలికే సంప్రదాయం వెనుకున్న రహస్యం – మనిషి నిత్య ఆశావాది కావడమే! ఆ ఆశావాదమే అడవి మనిషిని అణు అధికారిగా మార్చింది. ఎదురుదెబ్బలెన్ని ఎదురైనా అదరక, బెదరక సమస్యల సునామీలకు ఎదురేగి మరీ దూసుకుపోయే సుగుణమే మనిషిని ఇతర జీవరాసులలో శ్రేష్ఠుణ్ణి చేసింది. శిశిరం వస్తుంది, పోతుంది, మళ్లీ వస్తుంది. అయినా వసంత పవన తాకిడికే పరవశించిపోతుంది కోయిల. మధు మాసం రాగానే మావి చిగురు కొమ్మ మీద చేరి రాగాలాపన చేస్తుంది. అలాగే గత అనుభవాలు ఎలా ఉన్నా – రాబోయే కాలమంతా సర్వే జనా సుఖినోభవంతు, సర్వ జనావళికి శుభాలే కలగాలని మనసారా ఆపేక్షించడం ఒక్క మనిషికే చెల్లింది. అయితే 2013లో ఈ మనిషి చేసిందేమిటి? అంటే, ‘పతనంతో పోరాటం’ అనక మానదు.
పోరాటం – అది అరబ్బు ప్రపంచంలో నియంతలపై సాగిన ఆగ్రహ జ్వాలలే కావచ్చు. మళ్ళి నిరాయుధ ప్రజలను గురి పెట్టి చూసిన కరకు మర తుపాకులే కావచ్చు. మళ్లీ మళ్ళీ శాంతి కపోతాల రక్తాన్ని చవి చూసిన ఇనుప మూతి కాకులే కావచ్చు. ఐరోపాలో ఆర్థిక సంకోభంపై సమరమే కావచ్చు. భారత దేశంలోనిర్భయ నిరసనలే కావచ్చు. రూపిణి పతనావస్థకు గురి చేసిన పరిస్తుతులే కావచ్చు.సామ్రాజ్యవాదులను సమస్యల్లోకి, సామాన్యులను కష్టాల్లోకి నెట్టిన, ముంచుతున్న ఆర్థిక సంకోభమే కావచ్చు. వెరసి 2014 వీటికి ఓ పెను సవాల్‌!
ఏది ఏమైనా, కాలం – దాని విలువ అమూల్యం. అది కలిమితో కొనలేనిది, బలిమితో వశపర్చుకోలేనిది. ఒక్కసారి చేజారితే తిరిగి సంపాదించుకోలేనిది. మ్రొక్కి పట్టుకోలేనిది, వెతికి వెనక్కి తెచ్చుకోలేనిది. నియతి తప్పక నడితే ఆ కాలం మనిషికిచ్చే సందేశం – శిశిరంలో సయితం వసంతాన్నే కలగనమని. గతి తప్పిన చోటు నుంచే మతి మార్చుకుని మసలుకోమని. మానవ జాతికి ఊపిరి స్వాతంత్య్రం – అది జ్యోతిగా వెలిగే చైెతన్యం – ఆ చైతన్యం నిలిచిన నాడే సమస్త జగతికి సౌభాగ్యం అని. శిఖరంలా ప్రతి మనిషీ శిరసెత్తిన నాడే, అవనీ ఆకాశం, సూర్య చంద్ర నకత్రాల్లా ఆ సర్వేశ్వరుడికి తల వంచిన నాడే, జల నిధిలా ప్రతి హృదయం అలలెత్తిన నాడే మానవ జీవన గమనంలో మాయని వెలుగుల మహోదయం అని. అది గతాన్ని సింహావలోకనం చేసుకుని బంగారు భవిష్యత్తుకు దైవవిధేయతా పునాదులు వేసుకోవడంతోనే సాధ్యమని.
”కాలం సాక్షిగా! నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించినవారు, ఒండొకరికి సహనం (స్థయిర్యం) గురించి తాకీదు చేసిన వారు మాత్రం నష్టపోరు”. (అల్‌ అస్ర్‌: 1-3)

మధురమైన మాట


నేటి యువతరంల్లో నానాటికీ అభద్రతా భావం అధికమైపోతూంది.అలాగే వయసు మీద పడిందని మదనపడే పెద్దలకీ కొరవ లేదు. ఇట్టి పరిస్థితుల్లో ఒకరి సమక్షంలో వారు ఆనందంగా గడపడానికీ, వారి మనోభావాలను వ్యక్తపరచడానికి, వారి ఫీలింగ్స్‌ని చెప్పుకోవడానికీ, ‘నీకు నేను న్నాను’ అన్న ఫీలింగ్‌ కలగటానికీ నిజ మైన హితుడి ప్రాణ మిత్రుడి అవసరం ఉంటుంది. ఇలా పిల్లల నుంచి పెద్దల వరకు, యువకుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ స్నేహాన్నే కాంక్షిస్తారు. ఆ స్నేహ కాంక్షని మనం పాలతో పోల్చ వచ్చు. అవతలి వ్యక్తి ఇచ్చేది పంచాదార అయితే మనలో కరిగిపోతుంది. ఉప్ప యితే విరగ్గొడుతుంది. పెరుగయితే మన అస్థిత్వాన్ని మారుస్తుంది. నీరయితే పలు చన చేస్తుంది. కనుక మన పాలు ఎవరి పాలవ్వాలో మనమే నిర్ణయించుకోవాలి. ‘నేను చాలా ఒంటరిని నాకంటూ ఎవరూ లేరు. ఎవరూ నన్ను అర్థం చేసుకోరు. అందరితో నేను కలవలేక పోతున్నాను.’ అన్న దుర్భర స్థితి నుంచి ముందు బయట పడాలి.
ఇక వృద్ధుల విషమంటారా..! నిజంగా పరిశీలించి చూస్తే అసలైన జీవితం నలభై సంవత్సరాల తర్వాతే ప్రారంభమవు తుంది. ఇందుకు గొప్ప ఉదాహరణ ప్రవక్తలకు, ప్రవక్త పదవి 40 ఏండ్ల తర్వాత ప్రసాదించడమే. సగం జీవితం – ఇచ్చిన అనుభవ పరంపర నుంచి సరికొత్త జీవితం ప్రారంభించాలి. ఆ వయసు దాటాక జీవితం కాటికి కాలుజాచి ఉం టుందనుకోవటం మూర్ఖత్వం. నిజంగా ఆ వయసు నుంచే కొత్త జీవితం ప్రారంభ మవుతుంది అని అనుకుంటే ఆ సరికొత్త జీవితం మరింత ఆనందప్రదంగా ఉం టుంది. వృద్ధాప్యం వయసుకే గానీ, మన సుకీ కాదని తెలుసుకోవాలి. మనిషి ఒం టరి తనానికి, అశాంతికి, అసంతృప్తికి బద్ధ శత్రువకటుంది. అది ‘వ్యాపకం’. ఒక మంచి వ్యాపకం మనిషి జీవితంలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. అర్థం చేసుకోగలిగితే, ఒక పుస్తకం, లేద ఒక గొప్ప వ్యక్తి చరిత్ర మనకి ప్రేరణ ఇస్తుంది. ‘ఇలా చెయ్యి’ అని శాసించకుండా ఎలా చేస్తే బావుంటుందో సలాహా ఇస్తుంది.
నేను, నా జీవితం, నా చదువు, నా ఉద్యోగం, నా కుటుంబం, నా బ్యాంక్‌ బ్యాలెన్సు అనుకుంటే నూతిలోని కప్పకీ ఒడ్డునున్న మనిషికీ తేడా ఏం ఉంటుంది చెప్పండి. కనుక జీవితం నిరాసక్తంగా అని పించినప్పుడు ఒంటరితనంతో సతమతమై పోయే బదులు రోజుకో గంట, వారానికో రోజు, నెలకో నాలుగు రోజులు, ఏడాదికో యాభై రోజులు మనకంటు ఓ గుర్తింపు నిచ్చిన సమాజం కోసం కేటాయించినప్పుడే జీవితానికి సార్థకత. సమాజ సేవ చేసినంత సేపూ ఇష్టంగా చేయండి. అందులో మమేకమైపోండి. ఆ శ్రమలో కష్టం ఉండదు. అసలట అసలే అన్పిం చదు. ప్రతిఫలాన్ని కోరుకోం కాబట్టి ఆశా నిరాశలుండవు. ఎవరో నెత్తిన కూర్చొని ఆజమాయిషీ చేస్తున్న భావనే కలుగదు. ఆ అదృష్టం సేవకులకే దక్కుతుంది. పరిమిత మైన అనుభావాలతో, పరిమితమైన వ్యక్తుల మధ్య బతికే బతుకు, జైలు జీవితం కంటే ఎక్కువేం కాదు. మన ఇల్లు, మన కుటుంబం, మన స్నేహితులు…అంతా ఇరుకిరుగా ఉంటుంది. బయటికెళ్తే బోలెడంత ప్రపంచం. ఓ కవి అన్నట్టు
ఓ ఫూల్‌ సర్‌ చడా జో చమన్‌సే నిక్‌లా’
‘ఉస్‌ షక్స్‌కు ఇజ్జత్‌ మిలీ జో వతన్‌సే నిక్లా.
మనిషికైనా, మరే మహాత్ముడికైనా గడప దాటాకే బుద్ధి వికసించింది.
ఒంటరితనంతో బాధ పడుతున్న వారికీ, డిప్రెషన్‌ లాంటి సమస్యలు వేధిస్తున్న వారికి సృష్టిరాసుల సేవకు మించిన చికిత్స లేదు అంటున్నారు మానసిక నిపుణులు.
అంత మంది కోసం పని చేస్తున్న ప్పుడు ఒంటరి భావనకు చోటెక్కడిది చెప్పండి. మనిషి ఎదుర్కొనే మానసిక సమస్యలకు బంధాల్ని మించిన, స్నేహపరా మర్శలకు మించిన మందేముంటుంది చెప్పండి. పైగా సమయాన్ని సృష్టి సేవ కోసం కేటాయించేవారు, మిగతావారికన్నా ఆరోగ్యంగా ఉంటారనీ, వారి ఆయుష్షు పెరుగుతుందిని, వారి సంపాదనలో శుభం కలుగుతుందిని ప్రవక్త (స) వారి పలు ప్రవచనాల ద్వారా రూడీ అవు తుంది. నిజమే మనకు బాగా ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఒత్తిడి ఉండదు. మనసు సేద తీరుతుంది. గుండే సాఫీగా పని చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
అలాగే భరించలేని దిగులు ఆవరించిన ప్పుడు ప్రవక్త (స) గారి ”యా బిలాల్‌ అరిహ్‌ నా బిస్సలాత్‌” (ఓ బిలాల్‌! మాకు నమాజు ద్వారా విశ్రాంతినివ్వు) అన్న మాటను అనుసరిస్తూ, తాగుడికి ఇతర వ్యర్థ వ్యసనాలకి బానిసకాకుండా, మస్జి దుకు వెళ్ళటం, దైవ సన్నిధిలో సజ్దా చేయటాన్ని అలవాటు చేసుకోండి. మరీ బోరుగా ఉన్నప్పుడు సిగరెట్‌ తాగాలనిపిం చటం, చుట్ట పీల్చాలనిపించడం ఒక హానికర వ్యసనమైతే, మంచి స్వరం గల ఖుర్‌ఆన్‌ పారాయణాన్ని, పరలోక భీతిని పెంచే హితబోధనం వినడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ..?
చెడ్డ వ్యసనం మనల్ని అధిగమించి ఎంతగా తన చెప్పు చేతలలో ఉంచుకొం టుందో, మంచి అలవాటు ఒక స్నేహి తునిగా, మన పక్కన చేరి, మనతో పాటు ఉండి స్పూర్తినిస్తుంది. అందుకే ఒక ప్రముఖ మేధావి ఇలా అన్నాడు:
(1) ఒక మంచి ఆలోచనకి అంకురంగా వెయ్య ండి. ఒక స్పూర్తి మొలక పైకొస్తుంది.
(2) ఒక స్పూర్తి మొలకని అంటు కట్టండి. ఒక చర్య పుష్పిస్తుంది.
(3) చర్య అనే పుష్పాన్ని ఫలించనివ్వండి. అలవాటు అనే ఫలం పక్వానిని కాస్తుంది.
(4) ఆ ఆరాధన (అలవాటు) అనే ఫలాన్ని ఆస్వాదించండి. అది మీకు లక్ష్యం చేరుకొనే శక్తినిస్తుంది.

మీరూ విజేత కాగలరు!



జీవితంలో అప్పుడప్పుడే అడుగు పెడు తున్న వ్యక్తికి 'నీకు ఏం కావాలి? భవి ష్యత్తుల్లో నువ్వు ఏం సాధించదలచుకు న్నావు?' అని అడిగితే చాలా మంది దగ్గర నుంచి సమాధానం ''నేను బాగా చదువు కొని, నా కాళ్ళ మీద నేను నిలబడగల గాలి. చక్కటి సంసారం, అందమైన ఇల్లు, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండి, మిగతా జీవితం విశ్రాంతి తీసుకుంటూ, మనవళ్ళు, మనవరాళ్ళతో ఆడుకుంటూ జీవితం సాగితే అంతకన్నా ఇంకేం కావాలి'' అంటారు. మరి కొంత మంది అయితే ఇంకాస్త ముందుకెళ్ళి-ఏ అమేరి కాకో, దుబాయ్‌కో వెళ్ళి అక్కడ కొంత కాలం (ఇష్టం లేకపోయినా) కష్టపడి అక్కడి నుంచి మా ఇంటికి డబ్బు పంపిస్తూ, పొదుపు చేసుకుంటూ తర్వాత స్వదేశానికి వచ్చి స్థిరపడి ఒక ఇల్లు కట్టుకుని..... (ఇక్కడి నుంచి మళ్ళి మామూలు సమాధా నమే) చెప్తారు. 
 'నాకు అనిల్‌ అంబానీలకున్నంత ఆస్తి ఉంటేనా -దర్జాగా కొంతకాలం బ్రతికి ఆ తర్వాత హాయిగా చచ్చిపోతాను' అనుకునే వాళ్ళకూ కొదువ లేదు. అలాగే 'నేను ఏమవ్వాలో, ఏం అవ్వకూడదో విధే నిర్ణయి స్తుంది' అని సంతాప పడేవారూ ఉంటారు.
 అందచందాలతో అలరారుతూన్న ఈ వింత విచిత్ర లోకాన్ని చూసి నేడే కాదు నాడు సైతం అనేకులు ఈ విధంగా ఆశించారన్నది గమనార్హం.  ఓ రోజు అతను (ఖారూన్‌) పూర్తి ఠీవి దర్పాలతో ప్రజల ముందుకు వచ్చాడు. అప్పుడు ప్రాపంచిక వ్యామోహపరులు కొందరు అతడ్ని చూసి 'ఖారూన్‌కు లభిం చిన సిరిసంపదలు మనకూ లభించుంటే ఎంత బావుండు! ఖారూన్‌ ఎంతో అదృష్ట వంతుడు' అన్నారు. అయితే జ్ఞానం కల వారు (వారి ఆలోచనా ధోరణిని విమ ర్శిస్తూ) ''మీ వైఖరి చాలా విచారకరం'' అన్నారు. (ఖసస్‌:79)

 'మీరన్నది సరైంది కాదు. పిల్లల్ని బాగా చదివించాలి. దానికి డబ్బు కావాలి. ఆడ పిల్లల పెళ్ళిళ్ళు చేయించడానికి మంచి సంబంధం రావాలంటే ఏదో అంతో ఇంతో ఇచ్చుకునే స్థోమత, హోదా ఉం డాలి కదా! ఇందులో తప్పేముంది?' అని మీరు అనొచ్చు. సరే మీ మాటను కాదన టం లేదు. కాని 'ఏదో ఈ బ్రతుకు ఇలా సంతృప్తిగా సాగిపోతే చాలు' అన్న మామూలు స్థాయి నుంచి 'ఇహ పరలోకం లో మనక్కావాల్సిందేదో మనం సాధించి తీరాలి' అన్న అత్యుత్తమ ఆలోచనాస్థాయికి వెళ్ళడం ఆరోహణ! అసలు సిసలైన కీర్తి శిఖర అధిరోహణ!! ఎందుకంటే, దేవుడు చేసిన ప్రకృతి నియమం అది. 
 ''ఏ జాతి అయినా తనను తాను సంస్క రించుకోనంత వరకూ అల్లాహ్‌ా కూడా నిశ్చయంగా దాని పరిస్థితిని మార్చడు, ఇదొక యదార్థం''. (రాద్‌:11)  తుమ్మ విత్తనం నాటి నిమ్మ చెట్టు మొల కెత్తాలని కోరుకోవడం అత్యాశ, పేరాశే కావచ్చు. కాని మామిడి విత్తనం నాటి మామిడి చెట్టే మొలకెత్తాలని, వివిధ మామిడి అంట్లు కట్టి రకరకాల మామిడి ఫలాల్ని పండించాలని కోరుకోవడంలో అత్యాశ ఏమీ లేదు. అసహజత ఎంత మాత్రం కాదు. అది మానవ సహజంతో పాటు మానవలోకాన్ని ప్రగతి పథంలో నడిపించే గొప్ప అభియోగం.
  మనిషి కృషి చేసిన ప్రతి రంగంలో ఫలం పొందుతున్నాడు. అయితే ఎవరి కార్య దృష్టి ఎన్ని దూరాల వరకు వెళ్ళగలుగు తుందో ప్రతిఫలమూ అంత దీర్ఘమయినదే ప్రాప్తిస్తుంది. ఈ  క్షణం కష్టపడితే మరు క్షణం ఫలం దక్కాలని కోరుకునేవారొకర యితే, యౌవనంలో పడిన శ్రమకు బదులు వృద్ధాప్యం హాయిగా గడపాలని ఆశించే వారు మరొకరు. ఇంకా కొందరయితే తాము కృషి సలిపిన దానికి తమ తర్వాతి తరాల వారు  సుఖ పడితే చాలనుకుం టారు. అలాగే బ్రతికుండి కూడా మరణిం చిన వారు కొందరైతే... తమ కృషి కార్య దీక్ష, దక్షతల మూలంగా మరణించి కూడా  ప్రజల హృదయాల్లో బ్రతికే ఉన్నవారు. శాశ్వత పేరు ప్రఖ్యాతలతో వర్థిల్లుతున్న వారు ఎందరో మహానుభావులు!
 దైవప్రవక్త(స) ఇలా ప్రబోధించారు:      ''స్వర్గం మనసుకి నచ్చని విషయాలతో కప్పబడి ఉంది. నరకం చుట్టూ మనో (తుచ్ఛ) కోరికలు అల్లుకొని వున్నాయి.'' కనుక ఏది నాటుతామో దాన్నే కోస్తాము.   ''జైసి కర్నీ వైసి భర్నీ - కమా తుదీను తుదాను'' మనం కోరుకునే ప్రతి వస్తు వును (స్వర్గంతో సహా) తీవ్ర తపన, శ్రమ వల్ల పొందగలం. లోకులు చూసే బాహ్య శక్తి మనలో వున్నట్లే, మనలోని అంతర్గత శక్తి, ఆత్మవిశ్వాసం కూడా విజయం కోసం అంతే అవసరం. మనతో మనం తరచు వేసుకోవాల్సిన ప్రశ్న ''నిన్ను నీవు ఎలా భావిస్తున్నావు ?'' అన్నదే కాని నిన్ను లోకులు ఏ దృష్టితో చూస్తున్నారన్నది కాదు. పూర్వం గొప్ప ప్రసిద్ధి గాంచిన నానుడి ఒకటుండేది. ప్రజలు మూడు రకాలు.
1) లోక చరిత్రతో వీరికి ఎటువంటి సం బంధం ఉండదు.
2) లోకంలో జరిగే సంఘటనలను ప్రేక్ష క పాత్రతో చూస్తుండిపోయేవారు.
3) కొత్త చరిత్రకు నాంది పలికేవారు.
  మరో విధంగా చెప్పాలంటే, గొప్పవాళ్ళు వ్యూహల గురించి, మధ్యములు సంఘట నల గురించి, అధములు వ్యక్తుల గురించి మాట్లాడుతారు. ఈ ముగ్గురిలో ఎవరు కాదల్చుకుంటున్నామో? మనమే నిర్ణయిం చుకోవాలి.
 కొందరి సంభాషణల్లో ఎక్కువ ఇతరుల గురించే ఉంటుంది. అందులో ఎక్కువ చెడే ఉంటుంది. తమకు తెలియని (ఆ వ్యక్తుల వ్యక్తిగత) విషయాలు కూడా తాము కళ్ళతో చూచినట్టుగా రెచ్చిపోయి మరీ చెప్పేస్తుంటారు. వీరే అధములు. 
 కాశ్మీర్‌ నుంచి కాల్ఫోర్నియా వరకూ వీరు చర్చిస్తుంటారు. అందులో వాస్తవం కన్నా కల్పన, అభిప్రాయమూ ఎక్కువ వుంటుం ది. వీరే మధ్యములు. 
 అదే గొప్పవారు, అనవసర విషయాలకి తమ సంభాషనాల్లో అంతగా ప్రాముఖ్యత ఇవ్వరు. వారి దృష్టిలో-1) అక్కడ లేని వ్యక్తి గురించి కానీ, 2) తమకు సంబం ధం లేనీ సంఘట గురించి గాని, 3) తమ లో లేని గొప్పల గురించిగాని చర్చించట మంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదు. సంభాషణ వల్ల తాము నేర్చుకుంటారు. లేదా, ఇతరులకి నేర్పుతారు. 
 జీవితంలో అది దేనికి సంబంధించిన దైనా పైకి రావాలంటే మూడు ప్రశ్నలు తప్పని సరి! 1) మన తప్పు ఎంత తొంద రగా సరిదిద్దుకుంటాము? 2) ఇతరుల తప్పుల్నుంచి (గుణపాఠం) ఎంత తొందరగా గ్రహిస్తాము? 3) మన బలహీనతల్నుంచి ఎంత తొందరగా బయట పడతాము? అందుకే పెద్దల న్నారు: ''ఇతరుల తప్పుల్నుంచి నేర్చుకోక తప్పదు. ఎందుకంటే, అన్ని తప్పులూ మనమే చేయటానికి సమయం సరిపోదు కాబట్టి''. మన జీవిత గృహాల్లోకి ఎందరో వస్తూ పోతూ  ఉంటారు.  కొందరే  తమ ప్రభావితపు ప్రతిభ పరిమళాల్ని వదిలి వెళ్తారు. అలాంటి వారి సహచర్యమే మన తదుపరి కర్తవ్యం.
  ఈ జీవితం నిరంతర సమర  క్షేత్రం. మనిషి కళ్ళు తెరవగానే ప్రారంభమవు తుంది. మళ్ళీ కళ్ళు మూసుకునే వరకు సాగుతుంది. మనిషి తన ఆత్మ చక్షువుల్ని తెరువగలిగే క్షణం మహత్తరమయినది. అది జీవన సంగ్రామానికి శంఖారావం. సంఘర్షణ సంరంభానికి ప్రారంభం. 
మన అంతర్‌చ్చక్షువుల్ని తెరిచే రెండు పరీక్షలు.....!

1 - మిమ్మల్ని మీరు పరీక్షంచుకోండి.....! 
1) మీరు మానసిక వ్యధ, అలజడితో సతమతమౌతున్నారా? అయితే మీ విజయాన్ని  గూర్చి పునరాలోచించుకోండి.
2) ఇతరులతో మీకు గల ప్రతి సంబంధం తెగిపోయిందని ఫీలవుతున్నారా? అయితే మీ విజయాన్ని గూర్చి పునరాలోచించుకోండి.
3) ఈ లక్ష్య సాధన కోసం ఇన్ని త్యాగాలు అవసరమా? అన్న ప్రశ్న మిమ్మల్ని కలచి వేస్తూందా? అయితే మీ విజయాన్ని పునర్పరిశీలించుకోండి.
4) మీరు విజేతలయి, ఇతరులు సాధించే విజయాల పట్ల అసూయ చెందుతున్నారా? 
 అయితే మీ విజయాన్ని పరిశీలించుకోండి.
5) 'నేను చెయ్యగలను' అన్న ఆత్మవిశ్వాసం గాక 'నేను మాత్రమే చెయ్యగలను' అన్న  ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఇతరుల సలహాలను పట్టించుకోవటం లేదా? అయితే మీ విజయాన్ని పునర్పరిశీలించుకోండి.
6) పడకపై మేను వాల్చి - లోకమంతా ప్రశాంతంగా నిద్రిస్తుంటే నాకు మాత్రం నిద్ర  పట్టడం లేదు, అన్న ఆలోచనతో మీ బుర్ర వేడెక్కుతుందా? అయితే మీ విజయాన్ని పునర్పరిశీలించుకోండి.
   
గుర్తుంచుకోండి! కోపం ద్వేషం - రెండింటి చివరి అక్షరమూ ఒకటే. వాటి వల్ల మిగిలేది కూడా అదే!.....''సున్నా'' !!
ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు.....!
''నేను నిజంగానే విజేతనా ?''     2 - మీరు విజేతలేనా.....?
 ఇది ఒక పరీక్షకన్నా ఘనపాటిది. జవాబివ్వక ముందు బాగా చదివి అర్థం చేసుకోండి. జవాబిచ్చే విషయంలో మీ ఆత్మే మీకు ప్రత్యక్ష సాక్షి! ఏది వ్రాసినా ఆత్మ సాక్షితోటి వ్రాయండి.                  
           
రంగం                             ప్రవర్తన                                          ఎల్లప్పుడు /   అప్పుడప్పుడు /    ఎప్పుడూ లేదు.
                
                             (అ) గుర్తు చేసుకుంటాను
అల్లాహ్‌తో                 (ఆ) మరువను
                             (ఇ) కలవాలన్న కుతుహాలం
ఆత్మతో                   (అ)ఆందోళన లేకుండా
                             (ఆ)విమర్శ పరశీలన
                             (ఇ) ఆత్మ పరిశీలన సమర్థించుకోవటం.
తల్లిదండ్రులతో           (అ) విధి నిర్వాహణ
                             (ఆ) సత్ప్రవర్తన
                             (ఇ) ఉపకారం
దాంపత్యం                 (అ) ఏదో తోసుకెళ్తున్నాం
                             (ఆ) పరస్పర కరుణ,దయ,జాలి.
                             (ఇ) పరస్పర ప్రేమాభిమానాలు.
సంతానంతో               (అ) సపోర్ట్‌ సమర్థించుట
                             (ఆ) దిశా  నిర్దేశం.
                             (ఇ) గాలికి వదిలెయ్యడం.శిక్షణారాహిత్యం.
బంధువులతో             (అ) కేవలం గుర్తు చేసుకుంటాను.
                             (ఆ) కేవలం వారితో కలిసి వుంటాను.
                             (ఇ) వారితో మంచిగా ప్రవర్తిస్తాను.
స్నేహితులతో            (అ) స్వార్థం
                             (ఆ) పరస్పర సహకారం శ్రేయం
                             (ఇ) జస్ట్‌ టైమ్‌ పాస్‌
పనితో                     (అ) కర్తవ్యాన్ని నెరవేరుస్తాను.
                             (ఆ) పనీ చేస్తాను. సహాయపడతానుకూడా
                             (ఇ) పనిలో ఆనందాన్ని ఆస్వాదిస్తాను
తోటి కార్మికులతో         (అ) రస్సా కషీ
                             (ఆ) ఏదో కలిసి వున్నాం
                             (ఇ) నిజమైన మిత్రుత్వం
అధికారులతో             (అ) నాపనేదో నేను చేసుకుంటాను.
                             (ఆ) అవసరం అన్పిస్తే సలహా ఇస్తాను.  హితవూ చెప్తాను.
                             (ఇ) వారితో కలిసి వుంటాను.
ప్రతిభావంతులతో        (అ) మంచిగా వ్యవహరిస్తాను
                             (ఆ) ఆదర్శంగా తీసుకుంటాను
                             (ఇ) శ్రేయోభిలాషిగా మసలుకుంటాను.
 సమయంతో             (అ) తప్పించుకు తిరిగే యత్నం
                             (ఆ) మధ్యే మార్గం
                             (ఇ) అత్యవసరమైన వాటికి ప్రాధాన్యత

25, డిసెంబర్ 2013, బుధవారం

మేధకు మేత

హఖాలిద్‌ బిన్‌ వలీద్‌ - అమర్‌ బిన్‌ ఆస్‌ - ఉస్మాన్‌ బిన్‌ తల్హ ముగ్గురూ హిజ్రీ శకం 8వ సంవత్సరంలో ఇస్లాం స్వీకరించారు. ప్రళయ దినాన శంఖం ఊపే దైవదూత 'ఇస్రాఫీల్‌'. అల్లాహ్ ఆదేశంతో వర్షాలు కురిపించే దైవదూత 'మీకాయీల్‌'.ప్రాణాలు తీసే దైవదూత 'మలకుల్‌ మౌత్‌'.ప్రవక్తల వద్ద దైవ వాణి తీసుకువచ్చే దైవదూత 'జిబ్రాయీల్‌'. ముగ్గురు జన్మించలేదు, కాని సృష్టించబడ్డారు: (1) సాలెహ్‌ (అ) ఒంటె.(2) మూసా (అ) పాము.(3) ఇబ్రాహీం (అ) పొట్టేలు. దైవప్రవక్త(స) హిజ్రీ శకం 11వ సంవత్సరం, రబీవుల్‌ అవ్వల్‌ 12వ హిజ్రీ రెండవ సంవత్సరంలో జకాత్‌ విధిగా నిర్ణయించబడింది. ప్రవక్త యాఖూబ్‌(అ) కు సంతానం 12 మంది. ఖిబ్లా మారిన తరువాత చేయబడిన తొలి నమాజు అసర్‌ నమాజు. హఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌(ర) దైవదౌత్యపు 6వ సంవత్సరములో ఇస్లాం స్వీకరించారు.అల్లాహ్‌ భూమ్యాకాశాలను 6 రోజులలో సృష్టించాడు. దైవప్రవక్త(స) సతీమణి హజ్రత్‌ ఖదీజ(ర) దైవదౌత్యపు 10వ సంవత్సరంలో పరమపదించారు.