8, ఫిబ్రవరి 2014, శనివారం

తన కోపం తన శత్రువు

సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ

అరిషడ్వర్గాలలో రెండోదైనది క్రోధం. అది ఎంత భయంకరమయిన దంటే దానిని ఆశ్రయించిన వ్యక్తికి పతనం తప్ప ప్రగతి ఉండదు. కోపం లేని మానువుడు ఉండడు అన్నది వాస్తమే. కానీ; స్థాయికి మించిన కోపం మనిషి జీవితాన్ని అనర్థం పాలు చేస్తుంది. ఒక్క క్షణం నిగ్రహం కొండంతటి ప్రామాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం ఆవేశం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.  మనం జీవితంలో ఏది సాధిం చాలన్నా కసి, ఆవేశం, ఆగ్రహంతోపాటు నిగ్రహం, సంయమనం ఎంతో అవసరం. ఈ కారణంగానే 'ఏదైనా ధర్మోపదేశం చేయండి, ఓ దైవప్రవక్తా!' అని అడిగిన ఓ వ్యక్తికి హితోపదేశం చేస్తూ 'కొపగించు కోకు' అని దైవప్రవక్త ముహమ్మద్‌ (స) వారు సెలవిచ్చారు. అది సరే, ఇంకేదైనా, మరేదైనా సెలవియ్యండి అని ఆ వ్యక్తి విన్నవించుకోగా, అడిగిన ప్రతిసారీ ప్రవక్త (స)  'కోపగించుకోకు!' అనే హితవు పలక డం ద్వారా సదరు వ్యక్తిలో గల ఆ అవలక్షణాన్ని తొలగించి అతన్ని నిగ్రహంగల నిండు మనీషిగా మలచదలిచారు ప్రవక్త (స). 
  
 కోపం ఎందుకు వస్తుంది? అంటే, సాధారణంగా కోరింది కోరినట్లు గా జరగకపోవడం, అనుకున్నది సమయానికి అవ్వక పోవడం, అహం దెబ్బ తినడం, తనకు వ్యతిరేకంగా సృష్టించబడిన వదంతుల్ని వినడం, తనకు దక్కాల్సిన హుక్కు దక్కకపోవడం, తృప్తి స్థానే తృష్ణ చోటు చేసుకోవడం, తీవ్రమయిన నిరాశనిస్పృహలకు లోనవ్వడం- మొదలగు కారణాల వల్ల కోపం కలుగుతుంది. సరయిన సమయం లో, సరయిన మోతాదులో, సరైన వారిపై, సరైన రీతిలో కోపాన్ని పదర్శించడం కూడా ఒక కళే. ఆ మాత్రం కోపాన్ని  సయితం మనిషి ప్రదర్శించలేకపోతే అతను, అతనికి సంబంధించిన ప్రతిదీ చులకనై పోతుంది. అలా అని ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతుండటం మంచిది కాదు. అలాంటి వ్యక్తికి స్వంత  సంతానం కూడా జడుసుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మేకపోతు గాంభీర్యమూ కూడదు. గుంట నక్క  వినయమూ వలదు.  కోపాన్నిగానీ, హాస్యాన్నిగాని సహజశైలి లో ప్రదర్శించాలి.
     
 ఈ సందర్భంగా ప్రవక్త (స) వారు చేసిన హితవు గమనార్హం! ''బల్ల యుద్ధంలో ప్రత్యర్థిని చిత్తు చేసినవాడు కాదు గొప్పోడు; కోపం వచ్చినప్పుడు ఎక్కడ ఎంత తగ్గాలో అంత తగ్గడం తెలిసి నోడు గొప్పోడు''. ఎందుకంటే, మితిమీరిన కోపం వల్ల ఆరోగ్యం ఎలాగూ పాడవుతుంది. దానికితోడు క్రోధం కలవాడికి కర్తవ్యం గోచరించదు. తరచూ తీవ్ర భావావేశానికి గురయ్యే వ్యక్తి ప్రాణ ఘాతుకమయిన హింసాచరణకు పాల్పడే ప్రమాదం ఉంది. రాపిడి వల్ల ఉద్భవించి అగ్ని ఆ చెట్టునే దహించివేసినట్లు దేహోత్పన్నమ యిన ఆగ్రహం పూర్తి శరీరాన్నే బూడిద పాలు చేసి వేస్తుంది. అందుకే-'తన కోపం తన శత్రువు, తన శాంతం తన మిత్రుడు' అన్నారు వెనుకటికి మన పెద్దలు.  

 ఆలస్యంగా ఆవేశానికి లోనయి, తొందరగా ఉపశమనాన్ని పొందే వ్యక్తి ఉత్తముడయితే, తొందరగా ఆవేశానికి గురై తొందరగా దాన్నుండి బయట పడే వ్యక్తి మధ్యముడయితే, తొందరగా కాని, ఆలస్యంగా కానీ క్రోధావేశానికి లోనై ఎంత సేపటికీ దాన్నుండి బయట పడక లోలోన దావానలంలా రగులుతూ ఉండే వ్యక్తి అధ ముడు. కాబట్టి మన కోపం సయితం ఆశీర్వచనం అయ్యేలా మనం చూసుకోవాలి. 'అల్లాహ్‌ా తేరా భలా కరే-అల్లాహ్‌ా నీకు సద్బుద్ధిని అనుగ్రహించు గాక!' వంటి పదాలను ఆవేశ ఘడియల్లో సయితం అలవాటు చేసుకోవాలి. 

నిగ్రహాన్ని  అర్థం చేసుకోవడం చాలా సులువు. బయట ప్రపంచం మన ఆలోచనలకు అనుగుణంగా లేదు. నాగరికమో, అనాగరిక మో, ఆధునికమో, ఆటవికమో-ఏమో కానీ అంతా తల్లక్రిందులవుల వుతోంది. మన మాట ఎవ్వరూ వినడం లేదు. మనం అనుకున్న ఏదీ జరగటం లేదు.చిర్రెత్తుకొస్తోంది. ఎదుటి వ్యక్తి పట్టుకొని చితక బాదేయాలనిపిస్తోంది. ఆ సమయంలో శాంతాన్ని ఆశ్రయించి చిరు నవ్వు చిందించడమే నిగ్రహం. ఇది అందరికీ అవసరమయిన గుణమే అయినా ఆధ్యాత్మిక రంగంలో అవిరళంగా పరిశ్రమిస్తున్న వారికి మరీ ముఖ్యావసరం అనే చెప్పాలి. ఈ సద్గుణం మనకుంటే ప్రత్యర్థులు మనల్ని కోపానికి లోను చేసి మన మనోభావాలతో ఆడు కోవాలనుకున్నా మన మనో నిర్మలం చెదరదు. ఇది చెప్పడానికి సులుళువుగానే చెప్పేసినా ఆచరణలో పెట్టడం మాత్రం అంత సులువు కాదు.ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా పేర్కొంటోంది:

 ''మంచీ-చెడు (ఎట్టి స్థితిలోనూ) సమానం కాలేవు. చెడును మంచి ద్వారా తొలగించండి. (ఆ తర్వాత మీరే చూద్దురు గాని) నీకు- తనకూ మధ్య బద్ధ విరోధం ఉన్న వ్యక్తి సయితం నీకు ప్రాణ మిత్రుడయి పోతాడు. అయితే ఈ భాగ్యం సహనశీలురకు మాత్రమే ప్రాప్తిస్తుంది. దీన్ని గొప్ప అదృష్టవంతులు మాత్రమే పొందగలుగు తారు''. (హామీమ్‌ అస్సజ్దా: 34, 35) 

స్వాతంత్య్రం పరిమళించాలంటే..


సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ

మేరా ముల్క్‌, మేరా దేశ్‌, మేరా యే వతన్‌
శాంతికా, ఉన్నతికా, ప్రేమ పూవనం

 అవును విశ్వంలోనే విశిష్ఠమయినది మన దేశం. మనకు దేశం అంటే ఎంతటి అభిమానమంటే, రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండాను చూస్తే చాలు అన్నీ మర్చిపోతాము. ఏదో తెలియని మధురానుభూతి, మరేదో చైతన్యం వీటన్నింటికీ మించి మది నిండా పొంగి పొర్లే దేశాభి మానం. జాతీయ జెండాను చూడగానే మనం పులకించి పోతాము, పరవశించి పోతాము. బహుశా ఇదే భారతీయతలోని గొప్పతనమేమో! ప్రపంచంలో ఏ దేశానికి లేని మానవ సంపద మన సొంతం. 

మన ఈ స్వాతంత్య్ర భారత దేశం  ఒకరిద్దరి కృషితో సాధ్యమయింది కాదు. ఒకరి కోసం కొందరు, కొందరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు పోరాడితే వచ్చింది కాదు నేటి మన ఈ స్వాతంత్య్రం. అందరి కోసం అందరూ కలిసి ఏక త్రాటిపై నిలిచి సమిష్టి పోరాడి సాధించుకున్నది నేటి మన ఈ స్వాతంత్య్రం. ఒక్క క్షణంలోనో, ఒక్క గంటలోనో, ఒక్క రోజులోనో వచ్చింది కాదు నేటి మన ఈ స్వాతం త్య్రం. కొన్ని వందల సంవత్సరాలు కలిసికట్టుగా పోరాడితే వచ్చింది నేటి మన ఈ స్వాతంత్య్రం. ఎంతో మంది అమరవీల, వీర జవానుల, చరితార్థుల త్యాగ ఫలితం నేటి మన ఈ స్వాతంత్య్రం. అద్వితీయంగా, అపురూపంగా నాటి స్వాంతంత్ర సంగ్రామం సాగింది గనకే,ఆ మహో న్నత అధ్యాయం నేటికీ అందరి చేతా కొనియాడ బడుతోంది. స్వాతం త్య్రమనే నిధి సాకారమయిన ఆ అద్భుత ఘట్టాన్ని తల్చుకున్నప్పుడల్లా భారతీయుడయిన ప్రతి పౌరుని హృదయంలో ఉద్వేగం ఉప్పొంగు తుంది. మది దాటిన సంతోషం 'జైహింద్‌' అని స్మరిస్తుంది. 

భారత దేశ చరిత్రలో స్వాతంత్య్రోద్యమం ఓ మహోజ్వల ఘట్టం. భార తీయుల పోరాట పటిమకు, త్యాగనిరతికి, నిరుపమాన దేశాభిమానా నికి ఈ సమరం నిలువుటద్దం.ఈ సమరాన్ని సుసంపన్నం చేసేందుకు జాతి, మత, కుల, ప్రాంతీయతలను విస్మరించి భారతీయులంతా ఏకో న్ముఖంగా ఆత్మార్పణలకు పోటీ పడటటం అమోఘం,అమేయం, అపూ ర్వం. ఒకే నినాదంగా, ఒకే లక్ష్యంతో, ఒకే మాటగా, ఒకే బాటగా కోట్లాది ప్రజానీకం ముందుకు సాగడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన మహత్తర ఘట్టం.  

ఈ పోరాటానికి భారత దేశపు అతి పెద్ద అల్ప సంఖ్యాక వర్గమయిన ముస్లిం సమాజం తనదైన భాగస్వామ్యాన్ని అందించింది. అపూర్వ త్యాగాలతో, అసమాన సాహసాలతో భారత ముస్లింలు మాతృభూమి విముక్తి పోరాటంలో పాల్గొని పునీతులయ్యారు. -

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి నేటికీ 67 వసంతాలు. కొన్ని రోజుల క్రితమే మనం 65వ గణతంత్ర సంబరాల్ని జరుపుకున్నాము. ఈ సుదీర్ఘ కాలంలో భారత్‌ పరిస్థితి మూడడుగులు ముందుకు రెండ డుగులు వెనక్కి అన్న రీతిలో ముందుకు సాగుతోంది.ఇందుకు ప్రధాన కారణం-స్వార్థపరులు, అవినీతిపరులు, అక్రమార్కులు, అసమర్థుల యిన నాయకులు, అటువంటి నేతలను ఎన్నుకొన్న ప్రజలు-మనం కూడా. నేడు మనం రాజకీయంగా ఎంతో చైతన్యవం తులయినప్పటి కీ, విద్యావంతులయినప్పటికీ కుల, మత, ప్రాంత, భాష వంటి వల్ల తీవ్ర ప్రభావితులయిన కారణంగా, సదరు నేత ఎంత అవినీతిపరుడ యినా, అయోగ్యుడయినా,నరరూప రాక్షసుడని తెలిసినా, తమ కులం వాడో, తమ మతంవాడో అయితే అతని అక్రమాలను, అఘాయిత్యాల ను పట్టించుకోకూడదనే ఒక మూర్ఖ సిధ్ధాంతానికి లొంగి బ్రతకడమే కాక, సదరు నేత వేల మంది ప్రాణాలు పోవడానికి కారణమయినా అతన్ని విమర్శించినవారిని ఎదుర్కొవడం తమ నైతిక బాధ్యతగా భావి స్తున్నాము గనకే అట్టి అవినీతిపరుల ఆటలు ఇంకా కొనసాగుతు న్నాయి. 

 కావాల్సినంత ధనదాహం...టాక్స్‌ సేవింగ్‌కి సరిపడేంత దానగుణం ..ఒంటి నిండా స్వార్థం..ఊరి నిండా లంచం..వ్యవస్థ మొత్తం అస్త వ్యస్థం..హృదయం-శ్మశానమంత విశాలం..గుణం-మానభంగం చేసే ంత పైశాచికం..చచ్చేంత భయం..చప్పేంత ధైర్యం...మౌనం కూడా సిగ్గు పడేంత చేతకానితనం..ఎప్పుడూ కలహం..అప్పుడప్పుడు ఐకమ త్యం...ఇది నేటి మన భాతరం. ఇదా మన పెద్ద ఆశించిన దేశం? 'నా దేశం చంద్రుని మీద మనిషిని నిలబ్టెకపోయినా ఫర్వా లేదు, భూమ్మీద మనిషిని మనిషిగా చూస్తే చాలు' అని డా.అంబేడ్కర్‌ చేప్పిన మాట అక్షరాల అచరణీయం. 
  
మన పూర్వీకులు శ్రమకోర్చి మనకు స్వాతంత్య్రాన్ని సంపాదించి పెట్టారు...ఎంత స్వాతంత్య్రం అంటే, ఉగ్రవాదం అనుకుంటూనే... విచక్షణారహితంగా కాల్పులు, పేలుళ్లు జిరిపేతంట, ప్రేమించలేదని ఆసిడ్‌ దాడి చేసేటంత, కట్నం తేలేదని కాటికి పంపించేటంత, అమ్మ నాన్నను వృధ్దాశ్రమానికి తరలించేంతట...ఆఖరికి సహజీవనం చేసే టంత, స్వలింగ సంపర్కానికి అధికారికంగా అనుమతి కోరేటంత, సొంత ప్రాణం తీసుకునే అంత, ఇతరుల స్వేచ్ఛను హరించేటంత స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్నాము..శభాష్‌!

 'ఫ్రీడం ఈజ్‌ రెస్పాన్సిబిలిటీ'  బాధ్యతారహిత స్వేచ్ఛ 'పిచ్చోడి చేతి లో రాయి' చాలా ప్రమాదకరం...మనకి వద్దు. మనం ప్రశాంతంగా బ్రతుకుతూ ఇతరులను కూడా ప్రశాంతంగా బ్రతకనిస్తే అది స్వేచ్ఛ. లేకపోతే అది జంతు స్వేచ్ఛ. కాబట్టి మన ప్రవర్తనను సమీక్షించు కుంటూ ముందడుగు వేయాలి. కోట్లాది జన హృదయాల ఆశలకు అనుగుణంగా మన భారతావనిని తిర్చిదిద్ది మన దేశ శక్తికి కీర్తి కిరి టాలు తొడిగించేందుకు ఆందరు కలిసికట్టుగా ముందుకు వస్తారని ఆశిస్తూ...!


ఇది మనుషులు చేసే పనియేనా?


సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ


''మీరు అల్లాహ్‌కు భయపడరా?...మీకు పూర్వం లోకవాసులెవరూ చేయని నీతిమాలిన పనికి మీరు పాల్పడుతున్నారే?! మీరు లోకంలోని పురుషుల వద్దకు పోతున్నారేమిటి? అల్లాహ్‌ మీ కొరకు జతగా సృష్టించిన మీ భార్యలను విడిచిపెతున్నారే! మీరు మరీ బరితెగించిన జనంలా ఉన్నారు''. (ఖుర్‌ఆన్‌: 29:161-166) అని తన జాతి వారినుద్దేశించి అన్నారు ప్రవక్త లూత్‌ (అ). 
 పై ఆయతులో పేర్కొనబడిన 'నీతిమాలిన పని' అంటే స్వలింగ సంపర్కం. ఈ అసహజ లైంగిక చేష్టకు మానవ చరిత్రలోనే తొట్టతొలి సారిగా పాల్పడిన పాపం లూత్‌ జాతి వారిది. 'కామా తురా ణాం న భయం న లజ్జ' అన్నట్లు కామంతో కన్ను మిన్ను కానక వ్యవహరించారు. దాని కోసం ప్రకృతి సిద్ధంగా నిర్దేశించబడిన సహజ పద్ధతి కూడా వారికి తృప్తినీయలేదు. బరితెగించి మరీ అస హజమైన పద్ధతి ద్వారా వారి కామ తాపాన్ని చల్లార్చుకున్నారు. వారు పాల్పడిన ఈ చేష్టకుగాను అల్లాహ్‌ా వారిని మహా భయంకరంగా శిక్షించాడు. 'స్వలింగ సంపర్కం మరియు  సహజీవనం (వ్యభి చారం) ఈ రెండూ జీవితంలోని 72 రకాల పాపాలకు ప్రేరకం' అని హజ్రత్‌ అలీ (ర) గారు చెప్పా రంటే ఈ ముదనష్టపు వ్యవహారం ఎంత ప్రమాదకరమైనదో ఆలోచనాపరులు అర్థం చేసుకోవచ్చు. 

 స్వలింగ సంపర్కం అత్యంత నీతి బాహ్యమయిన చేష్టగా, అసాంఘీక కార్యకలాపంగా ప్రపంచ మతాలన్నీ పరిగణిస్తున్నప్పటికీ, నేడు 126 దేశాలు స్వలింగ సంపర్కం నేెరం కాదని ఈ ముదనష్టపు చేష్టకు చట్టబద్ధతనివ్వడం అనేది ఆయా దేశ పాలకుల ఆలోచనలు ఏ దిశకు పయనిస్తున్నాయో చెప్పకనే చెబుతుంది. ఈ దుష్కృతి విష వీచికలు కొన్నేళ్ళుగా మన దేశ వాతావరణాన్ని సయితం కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నాయి.  ఇక ఎయిడ్స్‌ వ్యాధి అనేది స్వలింగ సంపర్కులకు ఎక్కువ గా సక్రమిస్తుందనేది అందరికి విదితమయిన విషయమే. 
 11.12.2013న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో స్వలింగ సంపర్కం చట్టం దృష్టిలో నేరం. స్వలింగ సంపర్కం ఏ రూపంలో  ఉన్నా అక్రమం, అనైతికం, అసహజమయినదేనని ఖరారు చేసింది ధర్మా సనం. 'పరస్పర సమ్మతితో స్వలింగ సంపర్కానికి పాల్పడితే అది నేరం కాదం'టూ ఢిల్లీ హైకోర్టు 2009లో ఇచ్చిన తీర్పుకు ప్రతిస్పందిస్తూ అప్పటి నెలవంక గౌరవ సంపాదకులు ముహమ్మద్‌ అజీజు ర్రహ్మాన్‌ గారు 'ఈ రోగ కారకాలను ప్రజా జీవితాల నుండి ఏరి వేయాలి' అంటూ ఈ దుష్చర్యను దుయ్య బట్టారు. అప్పటికీ-ఇప్పటికీ స్పష్టంగా కానవచ్చే తేడా ఏమిటంటే, దాదాపు ఐదు సంవత్స రాల చట్టబద్ధతత, భద్రత లభించిన కారణంగా నేటి ప్రజల గళంలో మార్పు కొట్టుకొచ్చినట్లు కన బడుతోంది. దీనికి తోడు బడా బాబుల సమర్థన కూడా పెద్ద ఎత్తునే వినబడుతోంది. 'వారూ మను షులే, వారికీ మనసుంటుంది, వారికీ మెదడుంటుంది' అనే ప్రబుద్ధులు, 'సహజీవనం అంతా ప్రమో దమే ప్రమాదం ఏమీ లేదు' అని ఉద్దండగా ఉపన్యాసాలిచ్చే ఉదారవాదులు ఒక్కసారి కాదు, వంద సార్లు ఆలోచించాలి! 
 సహజీవన విధానంగానీ, స్వలింగ సంపర్కంగానీ వీటి వల్ల జీవన విలువలు భ్రష్టు పడతాయి. ఇవి అటు వ్యక్తికి, ఇటు సంఘానికీ అనర్థదాయకం. ఈ రెంటి వెనకాల ఎవరు ఎంత కాదన్నా కామ తాపం చల్లార్చుకోవడమే  లక్ష్యంగా కొనసాగుతున్నది.'వినాశకాలే విపరీతి బుద్ధి' అన్నట్టు వికృత చేష్టలు అవి ఏ రూపంలో ఉన్నా విపరీతమయిన ఫలితాలే ఉంటాయి. ఈ నీతి మాలి చేష్టల్లో ఓ చేష్ట పూర్తిగా అసహజమయినదయితే, మరోకటి పూర్తిగా అధర్మమయినది. 
 'బుద్ధి కర్మానుసారిణి' అంటారు. కానీ మనిషి బుద్ధే చెడ్డది. 'పేళ్ళి అనేది పాత కాన్పెప్ట్‌' అంటూ నైతికతకు ఉన్న ఆ కాసిన్ని వలువల్ని సయితం ఊడబెరికే ప్రయత్నంలో మంచిని సమాధి చేసేవారికి నేడు మన సమాజంలో కొరత లేదు. కఠినమయిన చట్టాలు ఉంటేనే నేరాలూ, ఘోరాలూ ఆగడం లేదు.ఇక నేరానికే చట్టబద్ధత లభిస్తే నేరగాళ్ళకు, కామాంధులకు పట్టపగ్గాలుండవు. సతీ సహగమన స్థితి నుండి వేలాది సంస్కరణల ఫలితమే నేటి మన భాతర సమాజం. నాగరికత అనేది మనిషికి మరింత మంచిని, న్యాయాన్ని అందించాలి. అంతేగాని అధఃపాతాళానికి నెట్టేదిగా ఉండకూడదు. 
  పోతే, 377 నిబంధన కేవలం స్వలింగ సంపర్కులకే కాదు - దీని ప్రకారం పునరుత్పత్తికి దోహ దం చేయని ఏ రకమయిన లైంగిక ప్రక్రియ అయినా శిక్షార్హమే.భారత శిక్షాస్మృతి సెక్షన్‌ 377 (అస హజ నేరాలు) ప్రకారం ప్రకృతి విరుద్ధమయిన శృంగార కార్యకలాపానికి పాల్పడిన వారికి పదేళ్ళ దాకా శిక్ష విధించేందుకు అవకాశముంది. కాగా ఇదే సమయంలో ఈ ధోరణులు ఉన్న వారినిలో చట్టం విధించే శిక్ష పట్ల భయంతోపాటు, దైవభీతిని, నైతిక రీతిని పెంపొందించే ప్రయత్నం చేయ డం మనందరి కనీస మానవీయ ధర్మం!