3, జనవరి 2013, గురువారం

షైతాన్‌ ఎత్తుగడలు


పషైతాన్‌ ఎత్తుగడలు, కుట్రలు, పన్నాగాలు అనేకం. అతని ఇంద్రజాలం మరియు విష వలయాల్లో ఒకటి-మనిషికి సిరి సంపదలు ప్రాప్తమయితే అతనిలో వ్యతిరేక భావావేెశాల్ని పురి గోల్పుతాడు. తత్కారణంగా అతను తన ఆస్తి అంతస్థులని చూసు కొని మిడిది పడుతూ మైమరచి ప్రవర్తిస్తాడు. దైవ దాసుల్ని చీడపురుగుల్లా భావించే అహం అనే మహమ్మారి వాతన పడ తాడు. ఫలితంగా దైవాన్ని విస్మరించి ఇతర విషయాలపై మనసు లగ్నం చేస్తాడు. 
పసోమరితనం, బద్ధకం షైతాన్‌ గుణాలు. విశ్వాసులు కూడా
వీటికి బానిస అవ్వాలని షైతాన్‌ అభిలషిస్తాడు.
పబజారులో మొదటి వ్యక్తి ప్రవేశంతోపాటే షైతాన్‌ బృందాలు
కూడా రంగురంగుల జెండాలతో ప్రవేశిస్తాయి. చివరికి వ్యక్తి
బజారు నుండి వెలుపలికి రాగ అవీ బైటకొస్తాయి.
పఒంటరిగా ఉన్న వ్యక్తితో షైతాన్‌ ఉంటాడు. ఇద్దరైపోతే తను
పారిపోతాడు.
పషైతాన్‌ మీ వద్దకు వచ్చి, మిమ్మల్ని ఎవరు పుట్టించాడు? అని ప్రశ్నిస్తాడు. దానికి అల్లాహ్‌ా అన్న సమాధానం ఇవ్వబడుతోంది. ఆ తరువాత మళ్ళి మిమ్మల్ని మీ పూర్వీకుల్ని పుట్టించింది ఎవరు? అని మళ్ళి ప్రశ్నిస్తాడు. అల్లాహ్‌ా అని సమాధానం ఇవ్వబడు తోంది. చివరికి అల్లాహ్‌ాను పుట్టించిందెవరు? అని అడుగుతాడు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడితే అప్పుడు-'నేను అల్లాహ్‌ాను మరియు దైవప్రవక్త (స)ను విశ్వసించాను' అనండి. అంతే షైతాన్‌ మీ నుండి దూరంగా పారిపోతాడు.
పషైతాన్‌ రక్తం ప్రవహించినట్లు మీ నరనరాల్లో ప్రవహిస్తుం
టాడు.
పఒకరి పాపాల వల్ల అల్లాహ్‌ా అతన్ని నాశనం చేయాలను కుంటే, అతనిలో సిగ్గు లేకుండా చేస్తాడు. అతనిలో సిగ్గుబిడి యాలు దూరమైన తరువాత అతనికి ప్రజలంటే విరక్తి కలుగు తోంది. ప్రజలు సయితం అతన్ని అసహ్యించుకుంటారు. ఈ పరిస్థితి గనక దాపురిస్తే 'అతని నుండి సచ్చీలత' గుణం కూడా దేవుడు తీసుకుంటాడు. అలా అతను నమ్మకద్రోహిగా మారిపో తాడు. అప్పుడు అతన్నుండి తన కరుణ కటాక్షాల్ని కూడా లాక్కుం టాడు. ఆ విధంగా అతను దైవం నుండి ధిక్కరించబడిన దౌర్భా గ్యుడవుతాడు. ఆ తరువాత అతన్నుండి 'ఇస్లాం' శాంతి సుస్థిరతల ను దూరం చేస్తాడు.
పఅహం, గర్వం అనేది 70 ఏండ్ల ఆరాధనను వృధా చేస్తుంది.
కోపం, క్రోధం, తొందరపాటు షైతాన్‌ తరపు నుండి. షైతాన్‌ అగ్గితో సృజించబడ్డాడు. అగ్గిని జలం ఆర్పివేెస్తుంది. కనుక మీకు కోపం వచ్చినప్పుడల్లా వుజూ చేసుకోండి అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ (స)
.

మృదువుగా సలహా ఇవ్వాలి
'ఎవరయితే ఇతరుల తప్పులను క్షమిస్తారో అల్లాహ్‌ా వారి తప్పులను క్షమిస్తాడు' అని మానవ మహోపకారి ముహమ్మద్‌ (స) వారు సెలవి చ్చారు. మనం బజార్లలో తిరుగుతూ ఉంటాము. చెత్తాచెదారం చుట్ట ప్రక్కల పేరుకొని ఉంటుంది. అలాంటప్పుడు మనం ఒకటి రెండు ముల్లులయితే తీసేస్తాము. అధికంగా ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా తెలియజేస్తాం. అంతేకాని చెత్తను అధికంగా వ్యాపింపజేయలేం కదా! అలాగే మనం ఇతరులతో ఏవైనా లోపా లుంటే వారి మనసు గాయపడకుండా సర్ది చెప్పి, వారిని మార్చడానికి ప్రయత్నిస్తాం. అంతేగాని అందరితో చెప్పి పరువు తియ్యం కదా! ఒక వేళ మనం చెప్పినా వినకపోతే అతని విజ్ఞతకే వదిలి వేస్తాం.

హజ్రత్‌ ఉమర్‌ ఫారూక్‌ (ర) ప్రజల స్థితిగతులను తెలుసుకునేందుకు రాత్రిళ్ళు గస్తీ తిరుగుతుంటారు. ఆయన వెంట అబ్దుల్లా అనే అనుచ రుడు కూడా ఉన్నాడు. వీరికి ఒక ఇంటిలో నుంచి వెలుతురు కనబ డింది. హజ్రత్‌ ఉమర్‌ (ర) ఆ ఇంటిలోకి ప్రవేశించి చూడగా ఒక వృద్ధుడు మద్యం సేవిస్తూ కనబడ్డాడు. వెంటనె ఆయన ఆగ్రహోదగ్రు డయ్యారు. 'ఈ వయసులో మద్యం సేవించడానికి నీకు సిగ్గుగా లేదు?' అని నిలదీశారు. అప్పుడా వృద్ధుడు 'మీరు రెండు తప్పులు చేశారు. ఒకటి - నా ఇమట్లో నా అనుమతి లేకుండా ప్రవేశించారు. రెండోది - పనికట్టుకొని నా లోపాలను వెతుకుతున్నారు' అన్నాడు. ఈ మాటలు విన్న హజ్రత్‌ ఉమర్‌ (ర) వెంటనే తిరిగి వచ్చేశారు. కొంత కాలం తర్వాత ఆ వృద్దుడు హజ్రత్‌ ఉమర్‌ గారి సభలో కూర్చొని ఉన్నాడు. ఉమర్‌ (ర) పిలిచారు. వృద్ధుడు శిక్షిస్తారేమోనని భయ పడ్డాడు. అప్పుడు ఉమర్‌ (ర) వృద్ధునితో 'నేను నీ తప్పుని ఎవరితోనూ చెప్పలేదు. కనీసం నా వెంట ఉన్న అబ్దుల్లాతో కూడా!' అన్నారు. అప్పుడా వృద్ధుడు 'నేను కూడా మద్యం సేవించడం మానేస్తున్నాను. అందుకు మీరే సాక్షి' అన్నాడు.

ఇలా మనం చెప్పేది సమసరస భావంతో సలహా ఇస్తే ఎంతటి కఠినుడైనా ఇన్షా అల్లాహ్‌ా తప్పక మారగలడు. అలాగే అద్ధం అందరినీ ప్రతిబింబిస్తుంది. కాని అది ఒకరి లోపాలను మరొకరికి నివేదించదు. అందరి రహస్యాలను తనలో దాచుకుంటుంది. ఎవరి లోపాలైనా చెప్పి నప్పుడు అతను కోపంతో ఒకవేళ దాన్ని పగులగొట్టినా ఆ ముక్కల్లోంచి చూస్తే మళ్ళీ అదే లోపం కనిపిస్తుమది. అంతేగాని పగిలిపోయాను కదా అని అబద్ధం చెప్పదు. అదే విధంగా మనం కూడా ఎంతటి క్లిష్ట స్థితులు ఎదురైనా, ఎంతటి బాధలు పడాల్సి వచ్చినా, ఎన్ని కష్టాలు భరించాల్సి వచ్చినా మంచిని విడనాడకూడదు. వీలైనంత వరకూ సమాజంలో సంస్కరణలకు పునాది వేయాలే తప్ప మనకెందుకులే అని మన స్వార్థం మనం చూసుకోకూడదు. దైవం ప్రసాదించిన ఈ విలు వైన శరీరాన్ని ఎంతో కొంత నిస్వార్థంగా జీవితం సాగించడంలోనే నిజమైన ఆనందం ఉంది. ఆందులోనే పరలోక సాఫల్యం ఉంది.

కామెంట్‌లు లేవు: